Movie News

సైఫ్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఇటీవల జరిగిన దాడి వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దొంగతనం చేయడానికి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి.. ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేయబోవడం.. ఈ క్రమంలో సైఫ్ అతడితో ఘర్షణ పడడం.. ఈ క్రమంలో సైఫ్ మీద కత్తితో దాడి చేయడంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటన అనంతరం ఆ వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. సైఫ్ ఆసుపత్రి పాలయ్యాడు.

దాడి జరిగిన మూడు రోజుల తర్వాత షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు పట్టుకుని.. అతనే సైఫ్ మీద దాడి చేసినట్లుగా నిర్ధరించారు. ప్రస్తుతం కేసు విచారణ చురుగ్గా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు ఓ వార్త బయటికి వచ్చింది. సైఫ్ మీద దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించి పట్టుకున్న షరీఫుల్ ఇస్లాం నుంచి వేలిముద్రలు సేకరించిన పోలీసులు.. సైఫ్ ఇంట్లో దొరికిన వేలి ముద్రలతో పోల్చి చూడగా.. రెండూ వేర్వరుగా కనిపిస్తున్నాయట.

దీంతో పోలీసులు పట్టుకుంది అసలైన నిందితుడినేనా.. లేక ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయడం కూడా ఉందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సైఫ్ ఇంట్లో మొత్తం 19 మంది వ్యక్తుల వేలి ముద్రలను నిపుణుల బృందం సేకరించింది. సైఫ్ కుటుంబ సభ్యులు, పని వాళ్లవి కాకుండా ఉన్న వేలి ముద్రలు వేటితోనూ షరీఫుల్ ఇస్లాం వేలి ముద్రలు సరిపోవడం లేదట.

దీంతో మరోసారి విషయాన్ని నిర్ధరించడం కోసం మళ్లీ వేలి ముద్రల సేకరణ చేపడుతున్నారట. మరి రెండోసారి కూడా నిందితుడి వేలి ముద్రలు అక్కడి వాటితో సరిపోలకపోతే ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

This post was last modified on January 26, 2025 5:43 pm

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

3 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

3 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

4 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

5 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

5 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

5 hours ago