బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఇటీవల జరిగిన దాడి వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దొంగతనం చేయడానికి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి.. ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేయబోవడం.. ఈ క్రమంలో సైఫ్ అతడితో ఘర్షణ పడడం.. ఈ క్రమంలో సైఫ్ మీద కత్తితో దాడి చేయడంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటన అనంతరం ఆ వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. సైఫ్ ఆసుపత్రి పాలయ్యాడు.
దాడి జరిగిన మూడు రోజుల తర్వాత షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు పట్టుకుని.. అతనే సైఫ్ మీద దాడి చేసినట్లుగా నిర్ధరించారు. ప్రస్తుతం కేసు విచారణ చురుగ్గా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు ఓ వార్త బయటికి వచ్చింది. సైఫ్ మీద దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించి పట్టుకున్న షరీఫుల్ ఇస్లాం నుంచి వేలిముద్రలు సేకరించిన పోలీసులు.. సైఫ్ ఇంట్లో దొరికిన వేలి ముద్రలతో పోల్చి చూడగా.. రెండూ వేర్వరుగా కనిపిస్తున్నాయట.
దీంతో పోలీసులు పట్టుకుంది అసలైన నిందితుడినేనా.. లేక ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయడం కూడా ఉందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సైఫ్ ఇంట్లో మొత్తం 19 మంది వ్యక్తుల వేలి ముద్రలను నిపుణుల బృందం సేకరించింది. సైఫ్ కుటుంబ సభ్యులు, పని వాళ్లవి కాకుండా ఉన్న వేలి ముద్రలు వేటితోనూ షరీఫుల్ ఇస్లాం వేలి ముద్రలు సరిపోవడం లేదట.
దీంతో మరోసారి విషయాన్ని నిర్ధరించడం కోసం మళ్లీ వేలి ముద్రల సేకరణ చేపడుతున్నారట. మరి రెండోసారి కూడా నిందితుడి వేలి ముద్రలు అక్కడి వాటితో సరిపోలకపోతే ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
This post was last modified on January 26, 2025 5:43 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…