మహేష్ బాబు 29లో ప్రియాంకా చోప్రా ఫైనల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆమెనే మెయిన్ హీరోయిననే భావనతో. సాధారణంగా మన భారతీయ సినిమాల్లో హీరో ఎంత వయసు పెద్ద వాడైనా సరే హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా గ్లామరస్ గా చిన్న వయసుదే అయ్యుండాలి.
యువరాజులో మహేష్ పక్కన సిమ్రాన్ నే ప్రేక్షకులు అంతగా అంగీకరించలేకపోయారు. అక్కలా ఉందని ఫీలయ్యారు. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ అయ్యాక మహేష్ మరింత గ్లామరసయ్యాడు. అందుకే ప్రియాంక తన పక్కన ఆనదని అభిమానుల ఫీలింగ్.
ట్విస్ట్ ఏంటంటే అసలు ఇంతకీ ప్రియాంక పాత్ర ఏంటనేది రాజమౌళి టీమ్ కి తప్ప ఎవరికీ తెలియదు. మహేష్ ని ప్రేమించే రెగ్యులర్ తరహాలో ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ డ్యూయెట్లు పెట్టకుండా మేనేజ్ చేసిన జక్కన్న ఇప్పుడు పాత రూట్ లోకి వెళ్ళడు గాక వెళ్ళడు.
కాబట్టి ఇప్పటికిప్పుడు మహేష్, ప్రియాంకలను జంటగా ఊహించుకోవడం అవవసరం. అసలే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. బోలెడు క్యారెక్టర్లు, విదేశీ నటీనటులు ఉంటారు. అలాంటప్పుడు ఎవరికి ఎలాంటి రోల్ డిజైన్ చేశాడనేది జక్కన్న మాత్రమే చెప్పగలడు. సో వెయిట్ చేయాల్సిందే.
అప్పటిదాకా ఊహాగానాలు విని వదిలేయాలి తప్పించి లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. మొదటి షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న రాజమౌళి అదయ్యాక ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముంబైలోనా లేక హైద్రాబాదా అనేది ఇంకా బయటికి చెప్పడం లేదు.
ట్రిపులార్ లో తారక్ కు విదేశీ భామను సెట్ చేసినట్టు ఇందులోనూ మహేష్ పక్కన ఏదైనా సర్ప్రైజ్ చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గుట్టుగా దాచి ఒక్కసారిగా బ్లాస్ట్ చేయడంలో రాజమౌళి స్టైల్ వేరు. అలాంటప్పుడు వేచి చూడటమే ధోరణే ఉత్తమం. మొదటి భాగమా లేక సీక్వెల్ ఉంటుందా లేదానేది కూడా ఇప్పటికి సస్పెన్స్.
This post was last modified on January 25, 2025 5:50 pm
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…