‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో కన్నడ నటుడు యశ్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగిపోయాడో తెలిసిందే. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో అతనొకడు. ఐతే తన తర్వాతి చిత్రంపై ఉండే భారీ అంచనాల దృష్ట్యా యశ్ ఆచితూచి అడుగులు వేశాడు. కొత్త చిత్రాన్ని ఓకే చేయడానికి.. దాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి చాలా సమయమే తీసుకున్నాడు.
ఎట్టకేలకు కొన్ని నెలల కిందట తన కొత్త సినిమా ‘టాక్సిక్’ సెట్స్ మీదికి వెళ్లింది. ఐతే మేకింగ్ మొదలై.. సగం చిత్రీకరణ పూర్తయి.. ఇటీవలే టీజర్ సైతం రిలీజైనా సరే.. ఇందులో కథానాయిక పాత్ర పోషించిన కీయారా టీజర్లో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇందులో నయనతార కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమేనని టీం నుండి లీక్ వచ్చేసింది.
ఈ విషయాన్ని ఇందులో విలన్ పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చూచాయగా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ప్రస్తుతం యశ్ సినిమా షూటింగ్లో ఉన్నట్లు చెప్పిన వివేక్.. ఈ చిత్రంలో నయనతార నటిస్తోందని హింట్ ఇచ్చాడు. ఇంతకు మించి వివరాలను తాను వెల్లడించలేనని, త్వరలోనే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారన్న వివేక్.. అప్పటి వరకు వేచిచూడాలని అన్నాడు.
ఇప్పటికే హీరోయిన్ గా ఉన్న కియార తో రెండు కీలక షెడ్యూల్స్ షూట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు అదనంగా సౌత్ టాప్ హీరోయిన్ నయనతార ఎలాంటి పాత్రలో దర్శనమిస్తుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ రిలీజ్ దశగా షూటింగ్ జరుగుతుంది. మరి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారో లేక మరోసారి వాయిదా వేస్తారో వేచి చూడాలి.
This post was last modified on January 25, 2025 8:18 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…