సినిమా కోసం ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా పైసా ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేసుకోవడంలో రాజమౌళిని మించిన వారు లేరేమో. చిన్న ఫోటో లాంటి వీడియోతో ఒక రాత్రి మొత్తాన్ని సోషల్ మీడియా కంట్రోల్ లోకి తీసుకురావడం ఆయనకే చెల్లింది. నిన్న అందరూ పడుకున్న తర్వాత మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసేసుకుని షూటింగ్ మొదలుపెడుతున్నట్టు ఆయన పెట్టిన్స్ సింహం ఫోటో క్షణాల్లో మీమ్స్ కు దారి తీసింది.
అన్నీ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఒకదాన్ని మించి మరొకటి నవ్వులు కురిపించేలా వైరలవుతున్నాయి. ఇక వాట్స్ అప్ తదితర మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు.
జులాయిలో అలీ బ్రహ్మానందం మధ్య జరిగే పేపర్ సీన్, ఒక్కడులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఎపిసోడ్, డార్లింగ్ లో ప్రభాస్ ఫ్రెండ్స్ కామెడీ, మహర్షి, లియో, నమో వెంకటేశ, రచ్చ, సూపర్ లో అలీ వేసే బొమ్మ సన్నివేశం ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందల సినిమాల రెఫెరెన్సులు మీమ్స్ లో వాడటం చూస్తుంటే అభిమానుల క్రియేటివిటీకి ముచ్చట వేయక మానదు.
ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ వీటిని మాములుగా ఎంజాయ్ చేయడం లేదు. ఇకపై ఫారిన్ ట్రిప్పులు లేకుండా పూర్తిగా ఎస్ఎస్ఎంబి సెట్లోనే తమ హీరో ఉంటాడని, తద్వారా త్వరగా షూటింగ్ అయిపోతుందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే ఎస్ఎస్ఎంబి 29 ఈ రేంజ్ లో ట్రెండింగ్ కావడం చూస్తుంటే ఫస్ట్ లుక్ లేదా టీజర్ కు ఏకంగా సర్వర్లు క్రాష్ అవుతాయేమో. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది రెండు మూడేళ్లు నిర్మాణంలో ఉండదని ఇన్ సైడ్ టాక్.
మొదటి భాగాన్ని ఏడాదిన్నర లోపే సిద్ధం చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నారట. ప్రియాంకా చోప్రా హీరోయినా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయని వినికిడి. ఆస్కార్ గెలిచిన టీమ్ కాబట్టి సంగీతం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
This post was last modified on January 25, 2025 3:16 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…