దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన రూపొందించిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్స్ అయ్యాయి.
తర్వాత కాలంలో ఫామ్ తగ్గిపోయి ఎక్కువ ఫ్లాపులు చవి చూసిన మణిరత్నం దుల్కర్ సల్మాన్ ఓకే బంగారంతో తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టనిపించినా కడలి, చెలియా, నవాబ్ లాంటివి మళ్ళీ వెనక్కు లాగాయి. ఇతర భాషల్లో ఏమో కానీ తమిళంలో గొప్ప విజయం సాధించిన పొన్నియిన్ సెల్వన్ తిరిగి ఈయన్ను ట్రాక్ లోకి తెచ్చి పెట్టింది.
ఇటీవలే కమల్ హాసన్, శింబుతో తగ్ లైఫ్ పూర్తి చేసిన మణిరత్నం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. వేసవి విడుదల కావడంతో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో త్రిష హీరోయిన్. అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇదయ్యాక మణిరత్నం ఎవరితో చేస్తారనే డౌట్ అందరిలో ఉంది. దళపతి కాంబినేషన్ రిపీట్ చేస్తూ రజనీకాంత్ కు ఒక కథ చెప్పారనే టాక్ ఉంది కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పట్టేలా ఉండటంతో ఈ లోగా కొత్త కుర్రాళ్ళు, అమ్మాయిలతో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట.
ఒకప్పుడంటే మణిరత్నం రొమాన్స్ అద్భుతంగా పండి తెరమీద ఒక కవిత చదువుతున్న భావన కలిగేది. మరి ఈ వయసులో కూడా అదే ఇంపాక్ట్ ఇచ్చేలా ఎలాంటి కథ రాసుకున్నారనేది ఆసక్తికరం. తక్కువ బడ్జెట్ లో వేగంగా పూర్తయ్యేలా ఈ లవ్ ఎంటర్ టైనర్ ఉంటుందని చెన్నై టాక్.
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తగ్ లైఫ్ వర్క్ చివరి దశలో ఉన్నప్పుడు అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు గ్యాప్ రాకుండా వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్న మణిరత్నం తెలుగులోనూ ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ అది నెరవేరే అవకాశాలు లేనట్టే. మన స్టార్ల డేట్లు ఖాళీగా లేవు మరి.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…