ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ కోసం నటుడిగా మారిపోయారు. కానీ డైరెక్టర్ గా ఏదో ఒక రోజు కంబ్యాక్ ఇవ్వకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విక్రమ్ హీరోగా ఆయన రూపొందించిన ధృవ నచ్చత్తిరమ్ పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా మోక్షం దక్కించుకోకపోవడం ఆర్థికంగా దెబ్బ కొట్టింది.
దాన్ని బయటికి తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకపోయింది. తాజాగా గౌతమ్ మీనన్ మల్లువుడ్ లో అడుగు పెట్టారు. మమ్ముట్టి హీరోగా డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ తీశారు. నిన్ననే విడుదలయ్యింది.
ఆసుపత్రిలో దొరికిన ఒక మహిళ పర్సు వెనుక గుట్టుని తెలుసుకోవడానికి ఒక మాజీ సిఐ కం డిటెక్టివ్ డామినిక్ చేసే ప్రయత్నమే ఈ సినిమా మూలకథ. పాయింట్ చూస్తే ఏదో గుర్తొస్తోంది కదూ. అవును. నాగార్జున శివమణిలో రక్షితకు బీచ్ లో సీసా దొరికితే దాని వెనుక ఉన్న స్టోరీని తెలుసుకునేందుకు గోవా వెళ్తుంది. కాకపోతే అది లవ్ స్టోరీ.
డామినిక్ లో కామెడీ ప్లస్ సస్పెన్స్ కలగలిపే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి ఎప్పటిలాగే తన అనుభవంతో నెట్టుకురాగా గౌతమ్ తన రెగ్యులర్ స్టైల్ లో నెమ్మదిగా కథనాన్ని నడిపించడం అంత కిక్ ఇవ్వలేకపోయింది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మెప్పించినా అసలు మ్యాటర్ నత్తనడకే.
మలయాళంలో ఇలాంటి స్లో థ్రిల్లర్స్ వర్కౌట్ అవ్వడం సహజమే కాబట్టి హిట్ అవొచ్చేమో కానీ ఇతర ప్రేక్షకులకు మాత్రం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఆశించిన సంతృప్తిని ఇచ్చే అవకాశం లేదు. అధిక శాతం ఊహించేలా స్క్రీన్ ప్లే జరగడం, బోర్ కొట్టడం ఈ మూవీలోని ప్రధాన మైనస్సులు.
డబ్బింగు, రీమేక్ కి ఛాన్స్ లేనట్టే. ఇది సక్సెస్ అయితే మళ్ళీ ట్రాక్ లో వద్దామనుకున్న గౌతమ్ మీనన్ కు ఆ ఆశ ఎంత మేరకు నెరవేరుతుందో చెప్పలేం. మమ్ముట్టి నటించిన గత థ్రిల్లర్స్ స్థాయిలో సక్సెసయ్యేలా లేదని ట్రేడ్ టాక్. చూస్తుంటే ఈ కల్ట్ దర్శకుడికి ఎదురుచూపులు కొనసాగడం తప్పేలా లేదు.
This post was last modified on January 24, 2025 10:23 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…