ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ కోసం నటుడిగా మారిపోయారు. కానీ డైరెక్టర్ గా ఏదో ఒక రోజు కంబ్యాక్ ఇవ్వకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విక్రమ్ హీరోగా ఆయన రూపొందించిన ధృవ నచ్చత్తిరమ్ పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా మోక్షం దక్కించుకోకపోవడం ఆర్థికంగా దెబ్బ కొట్టింది.
దాన్ని బయటికి తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకపోయింది. తాజాగా గౌతమ్ మీనన్ మల్లువుడ్ లో అడుగు పెట్టారు. మమ్ముట్టి హీరోగా డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ తీశారు. నిన్ననే విడుదలయ్యింది.
ఆసుపత్రిలో దొరికిన ఒక మహిళ పర్సు వెనుక గుట్టుని తెలుసుకోవడానికి ఒక మాజీ సిఐ కం డిటెక్టివ్ డామినిక్ చేసే ప్రయత్నమే ఈ సినిమా మూలకథ. పాయింట్ చూస్తే ఏదో గుర్తొస్తోంది కదూ. అవును. నాగార్జున శివమణిలో రక్షితకు బీచ్ లో సీసా దొరికితే దాని వెనుక ఉన్న స్టోరీని తెలుసుకునేందుకు గోవా వెళ్తుంది. కాకపోతే అది లవ్ స్టోరీ.
డామినిక్ లో కామెడీ ప్లస్ సస్పెన్స్ కలగలిపే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి ఎప్పటిలాగే తన అనుభవంతో నెట్టుకురాగా గౌతమ్ తన రెగ్యులర్ స్టైల్ లో నెమ్మదిగా కథనాన్ని నడిపించడం అంత కిక్ ఇవ్వలేకపోయింది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మెప్పించినా అసలు మ్యాటర్ నత్తనడకే.
మలయాళంలో ఇలాంటి స్లో థ్రిల్లర్స్ వర్కౌట్ అవ్వడం సహజమే కాబట్టి హిట్ అవొచ్చేమో కానీ ఇతర ప్రేక్షకులకు మాత్రం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఆశించిన సంతృప్తిని ఇచ్చే అవకాశం లేదు. అధిక శాతం ఊహించేలా స్క్రీన్ ప్లే జరగడం, బోర్ కొట్టడం ఈ మూవీలోని ప్రధాన మైనస్సులు.
డబ్బింగు, రీమేక్ కి ఛాన్స్ లేనట్టే. ఇది సక్సెస్ అయితే మళ్ళీ ట్రాక్ లో వద్దామనుకున్న గౌతమ్ మీనన్ కు ఆ ఆశ ఎంత మేరకు నెరవేరుతుందో చెప్పలేం. మమ్ముట్టి నటించిన గత థ్రిల్లర్స్ స్థాయిలో సక్సెసయ్యేలా లేదని ట్రేడ్ టాక్. చూస్తుంటే ఈ కల్ట్ దర్శకుడికి ఎదురుచూపులు కొనసాగడం తప్పేలా లేదు.
This post was last modified on January 24, 2025 10:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…