అసలే థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల ఒకపక్క డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఆలస్యంగా ఒప్పందాలు చేసుకోవడమో లేదా స్ట్రీమింగ్ డేట్ బయటికి రాకుండా జాగ్రత్త పడటమో చేస్తున్నారు. కానీ సరైన ముందస్తు ప్లానింగ్ లేకపోతే సినిమా కిల్ అయిపోతుంది.
తాజాగా విడుదలైన ఐడెంటిటీ దానికి ఉదాహరణగా నిలుస్తోంది. మూడు వారాల క్రితం జనవరి 2 ఈ మలయాళం మూవీ రిలీజయ్యింది. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ డీసెంట్ టాక్ తో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించడంతో కొంత ఆలస్యంగా తెలుగులో తెచ్చారు.
టోవినో థామస్, త్రిష, వినయ్ వర్మ లాంటి తెలిసిన క్యాస్టింగ్ ఉండటం వల్ల మన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశం కాబోలు ఈ రోజు ఇక్కడ విడుదలయ్యింది. ట్విస్ట్ ఏంటంటే జనవరి 31 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ చేయబోతున్నట్టు జీ 5 అధికారికంగా ఈ రోజే ప్రకటించేసింది. అది కూడా కేవలం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే కాదు ప్రధాన భాషల అనువాదాలు కూడా ఉంటాయని ప్రోమోలో పేర్కొంది.
అంటే సరిగ్గా ఏడు రోజులకు ఇంట్లోనే చూసేయొచ్చన్న మాట. ఈ మాత్రం దానికి వ్యయ ప్రయాసలు కూర్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని థియేటర్స్ లో వదలడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఐడెంటిటీ ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. యాక్సిడెంట్ కేసులో కీలక సాక్ష్యంగా నిలిచి జ్ఞాపకశక్తి కోల్పోయిన ఓ అమ్మాయి జీవితంలో ఇద్దరు యువకులు వస్తారు. వీళ్ళ మధ్య జరిగే థ్రిల్లింగ్ విచారణే ఐడెంటిటీ.
పాయింట్ పరంగా ఆసక్తి అనిపించే ఈ సినిమాని పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా మలచడంలో దర్శకులు అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ పడిన తడబాటు ప్రభావాన్ని తగ్గించింది. సరే ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇలా కేవలం వారం గ్యాప్ లో ఇలా సినిమాలు డిజిటల్ లో రావడం వల్ల ఎవరికేం ప్రయోజనమో ఏమో కానీ థియేటర్ కెళ్లే ప్రేక్షకులు ఆగిపోయేలా ఉన్నారు.
This post was last modified on January 24, 2025 3:48 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…