Movie News

ఏడు రోజుల సంబరానికి థియేటర్ రిలీజా

అసలే థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల ఒకపక్క డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఆలస్యంగా ఒప్పందాలు చేసుకోవడమో లేదా స్ట్రీమింగ్ డేట్ బయటికి రాకుండా జాగ్రత్త పడటమో చేస్తున్నారు. కానీ సరైన ముందస్తు ప్లానింగ్ లేకపోతే సినిమా కిల్ అయిపోతుంది.

తాజాగా విడుదలైన ఐడెంటిటీ దానికి ఉదాహరణగా నిలుస్తోంది. మూడు వారాల క్రితం జనవరి 2 ఈ మలయాళం మూవీ రిలీజయ్యింది. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ డీసెంట్ టాక్ తో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించడంతో కొంత ఆలస్యంగా తెలుగులో తెచ్చారు.

టోవినో థామస్, త్రిష, వినయ్ వర్మ లాంటి తెలిసిన క్యాస్టింగ్ ఉండటం వల్ల మన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశం కాబోలు ఈ రోజు ఇక్కడ విడుదలయ్యింది. ట్విస్ట్ ఏంటంటే జనవరి 31 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ చేయబోతున్నట్టు జీ 5 అధికారికంగా ఈ రోజే ప్రకటించేసింది. అది కూడా కేవలం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే కాదు ప్రధాన భాషల అనువాదాలు కూడా ఉంటాయని ప్రోమోలో పేర్కొంది.

అంటే సరిగ్గా ఏడు రోజులకు ఇంట్లోనే చూసేయొచ్చన్న మాట. ఈ మాత్రం దానికి వ్యయ ప్రయాసలు కూర్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని థియేటర్స్ లో వదలడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ఐడెంటిటీ ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. యాక్సిడెంట్ కేసులో కీలక సాక్ష్యంగా నిలిచి జ్ఞాపకశక్తి కోల్పోయిన ఓ అమ్మాయి జీవితంలో ఇద్దరు యువకులు వస్తారు. వీళ్ళ మధ్య జరిగే థ్రిల్లింగ్ విచారణే ఐడెంటిటీ.

పాయింట్ పరంగా ఆసక్తి అనిపించే ఈ సినిమాని పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా మలచడంలో దర్శకులు అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ పడిన తడబాటు ప్రభావాన్ని తగ్గించింది. సరే ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇలా కేవలం వారం గ్యాప్ లో ఇలా సినిమాలు డిజిటల్ లో రావడం వల్ల ఎవరికేం ప్రయోజనమో ఏమో కానీ థియేటర్ కెళ్లే ప్రేక్షకులు ఆగిపోయేలా ఉన్నారు.

This post was last modified on January 24, 2025 3:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago