భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే ఉన్నాం. రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్డి పైరసీ లీక్ కావడం, దాన్ని ఏకంగా సోషల్ మీడియాతో పాటు బయట పబ్లిక్ ప్లేసుల్లో స్క్రీనింగ్ చేయడం లాంటివి చూసి ఫ్యాన్స్ నివ్వెరపోయారు.
దీని వెనుక నలభై అయిదు మంది ఉన్నారని గుర్తించిన ఎస్విసి బృందం ఆ మేరకు పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరిగిపోయాయి. ఇవన్నీ డిజాస్టర్ ఫలితాన్ని మార్చవు కానీ భవిష్యత్తులో ఇతర ప్యాన్ ఇండియా చిత్రాలకు ఒక అలెర్ట్ గా పనికొస్తుంది.
సరే జరిగిందేదో జరిగిందనుకుంటే గేమ్ ఛేంజర్ ఇంకా థియేటర్లలో ఉండగానే తాజాగా 4కె ప్రింట్ బయటికి రావడం అభిమానులను మరోసారి ఖంగారెత్తిస్తోంది. కేవలం 14 రోజులకే ఇలా జరగడం ఎవరూ ఊహించనిది. స్పష్టమైన ఆడియో, వీడియోతో ప్రత్యక్షం కావడం నిజంగా నివ్వెరపోవాల్సిన విషయమే.
దీని వెనుక ఎవరు ఉన్నారనేది తర్వాత తేలుతుంది కానీ రాను రాను హెచ్డి పైరసీ వెర్రి తలలు వేయడం పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు. పుష్ప 2 ది రూల్, మార్కో, సూక్ష్మ దర్శిని, బరోజ్, కంగువ లాంటివి ఓటిటి కన్నా ముందే దీని బారిన పడి నష్టాలను చవి చూశాయి.
థియేటర్ ప్రింట్లు పైరసీ కావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇలా హెచ్డిల రూపం చాలా ప్రమాదరకమైన పరిణామం. ఇప్పుడు కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇతర నిర్మాతలు ఈ మహమ్మారి బారిన పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు, పరిశ్రమ సమన్వయంతో పని చేస్తే తప్ప పరిష్కారం దొరకడం కష్టం. జరగండి జరగండి పాట నుంచి గేమ్ ఛేంజర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి.
ఆఖరికి విడుదలయ్యాక కూడా అదే రిపీట్ కావడం విషాదం. బాక్సాఫీస్ రన్ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్న తరుణంలో గేమ్ చేంజర్ మీద మరో పిడుగు పడటం గోరుచుట్టు మీద రోకలిపోటు లాగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…