భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే ఉన్నాం. రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్డి పైరసీ లీక్ కావడం, దాన్ని ఏకంగా సోషల్ మీడియాతో పాటు బయట పబ్లిక్ ప్లేసుల్లో స్క్రీనింగ్ చేయడం లాంటివి చూసి ఫ్యాన్స్ నివ్వెరపోయారు.
దీని వెనుక నలభై అయిదు మంది ఉన్నారని గుర్తించిన ఎస్విసి బృందం ఆ మేరకు పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరిగిపోయాయి. ఇవన్నీ డిజాస్టర్ ఫలితాన్ని మార్చవు కానీ భవిష్యత్తులో ఇతర ప్యాన్ ఇండియా చిత్రాలకు ఒక అలెర్ట్ గా పనికొస్తుంది.
సరే జరిగిందేదో జరిగిందనుకుంటే గేమ్ ఛేంజర్ ఇంకా థియేటర్లలో ఉండగానే తాజాగా 4కె ప్రింట్ బయటికి రావడం అభిమానులను మరోసారి ఖంగారెత్తిస్తోంది. కేవలం 14 రోజులకే ఇలా జరగడం ఎవరూ ఊహించనిది. స్పష్టమైన ఆడియో, వీడియోతో ప్రత్యక్షం కావడం నిజంగా నివ్వెరపోవాల్సిన విషయమే.
దీని వెనుక ఎవరు ఉన్నారనేది తర్వాత తేలుతుంది కానీ రాను రాను హెచ్డి పైరసీ వెర్రి తలలు వేయడం పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు. పుష్ప 2 ది రూల్, మార్కో, సూక్ష్మ దర్శిని, బరోజ్, కంగువ లాంటివి ఓటిటి కన్నా ముందే దీని బారిన పడి నష్టాలను చవి చూశాయి.
థియేటర్ ప్రింట్లు పైరసీ కావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇలా హెచ్డిల రూపం చాలా ప్రమాదరకమైన పరిణామం. ఇప్పుడు కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇతర నిర్మాతలు ఈ మహమ్మారి బారిన పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు, పరిశ్రమ సమన్వయంతో పని చేస్తే తప్ప పరిష్కారం దొరకడం కష్టం. జరగండి జరగండి పాట నుంచి గేమ్ ఛేంజర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి.
ఆఖరికి విడుదలయ్యాక కూడా అదే రిపీట్ కావడం విషాదం. బాక్సాఫీస్ రన్ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్న తరుణంలో గేమ్ చేంజర్ మీద మరో పిడుగు పడటం గోరుచుట్టు మీద రోకలిపోటు లాగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on January 24, 2025 11:08 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…