Movie News

పుష్ప-2… బీజీఎం గొడవ ఇంకా సమసిపోలేదా?

పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన ప్రతి సినిమాకూ సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తూ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమాకు మాత్రం పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాడు. అతడికి ఖాళీ లేదో.. లేక తన వర్క్ నచ్చలేదో కానీ.. రిలీజ్ ముంగిట బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ కోసం తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్.. ఇలా ముగ్గురిని తీసుకున్నాడు సుకుమార్.

ముగ్గురికీ కొన్ని సీన్లు అప్పగించడం.. వాళ్లు ఔట్ పుట్ ఇవ్వడం.. చివరికి తమన్, అజనీష్‌ల వర్క్ పక్కన పెట్టి సామ్ సీఎస్ స్కోర్ మాత్రం తీసుకుని సినిమాలో కొన్ని సన్నివేశాలకు వాడుకోవడం తెలిసిందే. దీనిపై దేవిశ్రీ తన అసహనాన్ని ఓ ఈవెంట్లో వెళ్లగక్కేశాడు. అతడి పట్టుదల వల్లే టైటిల్ కార్డ్స్‌లో సంగీతం, నేపథ్య సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అని ప్రత్యేకంగా వేశారు. సామ్ సీఎస్‌కు ‘అడిషనల్ బీజీఎం’ అని క్రెడిట్ ఇచ్చారు.

ఐతే సినిమాలో చాలా వరకు దేవిశ్రీ స్కోరే వాడారని.. పరిమితంగా కొన్ని సన్నివేశాలకు మాత్రమే సామ్ వర్క్ తీసుకున్నారని యూనిట్ వర్గాలు చెప్పాయి. టైటిల్ కార్డ్స్ చూసినా ఇదే విషయం అర్థమైంది. కానీ సామ్ మాత్రం సినిమాలో 90 శాతం సన్నివేశాలకు తన స్కోరే వాడారని ఓ ఇంటర్వ్యూలో క్లైమ్ చేసుకున్నాడు. కానీ ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. సామ్ తన వర్క్ గురించి ఎక్కువ చేసి చెప్పుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో సామ్ మళ్లీ ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. ‘పుష్ప-2’ కోసం తాను ఎంత వర్క్ చేసింది చూపించడానికా అన్నట్లు ఈ సినిమా నుంచి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో మళ్లీ పుష్ప-2 బీజీఎం గొడవ మళ్లీ రాజుకున్నట్లు అయింది. మరి సినిమాలో ఉపయోగించిన తన వర్క్‌నే ఓఎస్టీ రూపంలో సామ్ రిలీజ్ చేస్తాడా.. లేక తాను టీంకు పంపిన ట్రాక్స్ విడుదల చేస్తాడా అన్నది ఆసక్తికరం.

మొత్తానికి అతను రిలీజ్ చేసే ఓఎస్టీని బట్టి సినిమాలోని బీజీఎంలో తన పాత్ర ఎంత అన్నది జనాలకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

This post was last modified on January 23, 2025 7:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

39 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago