డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు కనిపించినా తర్వాత చాలా బిజీ అయిపోయాడు. ముందుగా ఏప్రిల్ 10న జాక్ తో వస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో సిద్దు రొమాంటిక్ ప్రపంచానికి దూరంగా కనిపించబోతున్నాడు.
తర్వాత నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో కోహినూర్ వచ్చే ఏడాది విడుదలను టార్గెట్ చేసుకుంటోంది. ఇప్పుడు మరో కాంబో కుదిరిందని సమాచారం.
గత ఏడాది ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు పరశురామ్ ఇటీవలే సిద్దు జొన్నలగడ్డకు చెప్పిన కథ ఓకే అయిపోయి ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతున్నట్టు ఫిలిం నగర్ న్యూస్. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
ఫ్యామిలీ స్టార్ డిజాస్టరయ్యాక మరో సినిమా చేయాలని అప్పట్లోనే రాజు, పరశురామ్ మధ్య అంగీకారం కుదిరింది. కాకపోతే హీరోని సెట్ చేసుకోవడంలో జరిగిన ఆలస్యం వల్ల ఇంత టైం పట్టింది. బ్యాక్ డ్రాప్ ఏదనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఎంటర్ టైన్మెంట్ జానరేనని టాక్. గీతా గోవిందం టైపులో క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట.
సో లేట్ అయినా పరశురామ్ మంచి ఛాన్స్ పట్టేసినట్టే. మహేష్ బాబుతో సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ఈ దర్శకుడికి ఫ్యామిలీ స్టార్ మీద చాలా నమ్మకం ఉండేది. కానీ ట్రీట్మెంట్ లో జరిగిన తేడా వల్ల ప్రేక్షకులు ఆదరించలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వడం లేదట.
తన బ్యానర్ లో ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు ఇంకో ఆఫర్ ద్వారా దిల్ రాజు గతంలో హిట్లు కొట్టిన దాఖలాన్నాయి. వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ అలా బ్రేక్ తెచ్చుకున్నవాళ్ళే. మరి పరశురామ్ కూడా అదే కోవలోకి చేరతారేమో చూడాలి. స్క్రిప్ట్ లాక్ చేసుకుని వేసవి నుంచి షూటింగ్ మొదలుపెట్టొచ్చని తెలిసింది.
This post was last modified on January 23, 2025 6:03 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…