డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు కనిపించినా తర్వాత చాలా బిజీ అయిపోయాడు. ముందుగా ఏప్రిల్ 10న జాక్ తో వస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో సిద్దు రొమాంటిక్ ప్రపంచానికి దూరంగా కనిపించబోతున్నాడు.
తర్వాత నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో కోహినూర్ వచ్చే ఏడాది విడుదలను టార్గెట్ చేసుకుంటోంది. ఇప్పుడు మరో కాంబో కుదిరిందని సమాచారం.
గత ఏడాది ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు పరశురామ్ ఇటీవలే సిద్దు జొన్నలగడ్డకు చెప్పిన కథ ఓకే అయిపోయి ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతున్నట్టు ఫిలిం నగర్ న్యూస్. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
ఫ్యామిలీ స్టార్ డిజాస్టరయ్యాక మరో సినిమా చేయాలని అప్పట్లోనే రాజు, పరశురామ్ మధ్య అంగీకారం కుదిరింది. కాకపోతే హీరోని సెట్ చేసుకోవడంలో జరిగిన ఆలస్యం వల్ల ఇంత టైం పట్టింది. బ్యాక్ డ్రాప్ ఏదనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఎంటర్ టైన్మెంట్ జానరేనని టాక్. గీతా గోవిందం టైపులో క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట.
సో లేట్ అయినా పరశురామ్ మంచి ఛాన్స్ పట్టేసినట్టే. మహేష్ బాబుతో సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ఈ దర్శకుడికి ఫ్యామిలీ స్టార్ మీద చాలా నమ్మకం ఉండేది. కానీ ట్రీట్మెంట్ లో జరిగిన తేడా వల్ల ప్రేక్షకులు ఆదరించలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వడం లేదట.
తన బ్యానర్ లో ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు ఇంకో ఆఫర్ ద్వారా దిల్ రాజు గతంలో హిట్లు కొట్టిన దాఖలాన్నాయి. వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ అలా బ్రేక్ తెచ్చుకున్నవాళ్ళే. మరి పరశురామ్ కూడా అదే కోవలోకి చేరతారేమో చూడాలి. స్క్రిప్ట్ లాక్ చేసుకుని వేసవి నుంచి షూటింగ్ మొదలుపెట్టొచ్చని తెలిసింది.
This post was last modified on January 23, 2025 6:03 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…