‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే ఆయన తర్వాతి చిత్రాలేవీ సంతృప్తికర ఫలితాలు అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ఆచార్య, భోళా శంకర్ ఫలితాలు చిరు, ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేనివే. చిరు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి నవతరం దర్శకులతో పని చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వారి ఆకాంక్షలకు తగ్గట్లే వశిష్ఠ, శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లాంటి నవతరం దర్శకుల సినిమాలను లైన్లో పెట్టాడు మెగాస్టార్. ఇందులో వశిష్ఠతో చేస్తున్న ‘విశ్వంభర’ చివరి దశలో ఉంది. ఇక మిగతా రెండు చిత్రాలు ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తాయన్నదే తేలాల్సి ఉంది. శ్రీకాంత్ చిత్రమే ముందు అనౌన్స్ చేశారు కాబట్టి అదే మొదలవుతుందేమో అనుకున్నారు కానీ.. అది వాస్తవం కాదని తెలుస్తోంది.
ప్రస్తుతం నానితో ఓ సినిమా చేస్తున్న శ్రీకాంత్.. అది పూర్తయ్యాక చిరు సినిమాను ఆరంభించడానికి టైం పడుతుంది. ఈలోపు అనిల్ రావిపూడితోనే చిరు సినిమా ఉండబోతోంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అనిల్ స్క్రిప్టు, మేకింగ్ రెండింట్లోనూ చాలా ఫాస్టుగా ఉంటాడు. చిరు సినిమాను ఇంకో మూడు నెలల్లోనే అతను మొదలుపెట్టేయనున్నాడట. కాబట్టి ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది చిరు సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేయనున్నాడన్నమాట.
ఈ సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ఒక స్పెషల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మహా శివరాత్రికి ఈ టీజర్ లాంచ్ అవుతుందని అంటున్నారు. ‘జైలర్-2’ తరహలోనే ఒక అనౌన్స్మెంట్ టీజర్ను స్పెషల్గా షూట్ చేయనున్నారట. ప్రస్తుతం కాన్సెప్ట్ రెడీ చేసే పనిలో అనిల్ ఉన్నాడని.. త్వరలోనే దాని చిత్రీకరణ జరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది.
This post was last modified on January 23, 2025 5:33 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…