Movie News

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం మేకర్స్ పోటాపోటీగా తయారైన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ను లీడ్ రోల్‌లో పెట్టి ‘తలైవి’ అనే భారీ చిత్రం తీశారు. మరోవైపు గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రమ్యకృష్ణతో ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ సైతం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించింది. వీటికి పోటీగా మరోవైపు నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో ‘ది ఐరెన్ లేడీ’ పేరుతో ప్రియదర్శని అనే దర్శకురాలు మరో సినిమాను ప్రకటించారు.

ఈ సినిమా కోసం నిత్య కొన్ని రోజులు వర్క్ షాప్‌లో సైతం పాల్గొంది. లుక్స్ పరంగా చూస్తే జయలలిత పాత్రకు నిత్యానే పర్ఫెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నటిగా కూడా ఆమె ప్రతిభ ఎలాంటిదో తెలిసిందే. ఐతే ఇక సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో ఈ చిత్రం గురించి వార్తలు ఆగిపోయాయి. ఐదేళ్లయినా ఏ అప్‌డేట్ లేదు.

ఈ చిత్రం ముందుకు కదలకపోవడానికి కారణాలేంటో నిత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘జయలలిత బయోపిక్ చేయాలని మేం ఎంతో ఆశపడ్డాం. చర్చలు జరిగాయి. కానీ మా సినిమా ప్రకటించాక అదే కథతో ‘తలైవి’ అనే సినిమా వచ్చింది. మేం కూడా అదే కథతో సినిమా చేస్తే రిపీటవుతుంది కదా అని సందేహించాం. కానీ మా నాన్న మాత్రం జయలలిత బయోపిక్‌లో కచ్చితంగా నటించమని అడిగారు. మేం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఇంకొన్ని రోజులకే ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్ కూడా వచ్చింది.

అలా ఒకే కథపై రెండు ప్రాజెక్టులు వచ్చాక మేం సినిమా చేస్తే కచ్చితంగా రిపీట్ అవుతుందని అనుకున్నాం. అందుకే ఎంతో ఇష్టపడి చేయాలనుకున్న సినిమాను ఆపేశాం’’ అని నిత్యా మీనన్ తెలిపింది. ఇటీవల నిత్య కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ధనుష్ సరసన నిత్య ‘ఇడ్లీ కడై’ సినిమా చేస్తోంది.

Kumar

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

18 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago