దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం మేకర్స్ పోటాపోటీగా తయారైన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ను లీడ్ రోల్లో పెట్టి ‘తలైవి’ అనే భారీ చిత్రం తీశారు. మరోవైపు గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రమ్యకృష్ణతో ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ సైతం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించింది. వీటికి పోటీగా మరోవైపు నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో ‘ది ఐరెన్ లేడీ’ పేరుతో ప్రియదర్శని అనే దర్శకురాలు మరో సినిమాను ప్రకటించారు.
ఈ సినిమా కోసం నిత్య కొన్ని రోజులు వర్క్ షాప్లో సైతం పాల్గొంది. లుక్స్ పరంగా చూస్తే జయలలిత పాత్రకు నిత్యానే పర్ఫెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నటిగా కూడా ఆమె ప్రతిభ ఎలాంటిదో తెలిసిందే. ఐతే ఇక సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో ఈ చిత్రం గురించి వార్తలు ఆగిపోయాయి. ఐదేళ్లయినా ఏ అప్డేట్ లేదు.
ఈ చిత్రం ముందుకు కదలకపోవడానికి కారణాలేంటో నిత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘జయలలిత బయోపిక్ చేయాలని మేం ఎంతో ఆశపడ్డాం. చర్చలు జరిగాయి. కానీ మా సినిమా ప్రకటించాక అదే కథతో ‘తలైవి’ అనే సినిమా వచ్చింది. మేం కూడా అదే కథతో సినిమా చేస్తే రిపీటవుతుంది కదా అని సందేహించాం. కానీ మా నాన్న మాత్రం జయలలిత బయోపిక్లో కచ్చితంగా నటించమని అడిగారు. మేం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఇంకొన్ని రోజులకే ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్ కూడా వచ్చింది.
అలా ఒకే కథపై రెండు ప్రాజెక్టులు వచ్చాక మేం సినిమా చేస్తే కచ్చితంగా రిపీట్ అవుతుందని అనుకున్నాం. అందుకే ఎంతో ఇష్టపడి చేయాలనుకున్న సినిమాను ఆపేశాం’’ అని నిత్యా మీనన్ తెలిపింది. ఇటీవల నిత్య కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ప్రస్తుతం ధనుష్ సరసన నిత్య ‘ఇడ్లీ కడై’ సినిమా చేస్తోంది.
This post was last modified on January 22, 2025 2:33 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…