గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. అవే.. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడింట్లో మందు మొదలైన సినిమా ‘హరిహర వీరమల్లు’. అది ఎప్పుడో నాలుగేళ్ల ముందు అనౌన్స్ అయిన సినిమా. షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో ఈ చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది.
బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తీసుకున్నాడు. ఎట్టకేలకు నెల కిందట ఈ సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. పవన్ మళ్లీ డేట్లు కేటాయించిన తొలి చిత్రం ఇదే. పవన్ అధికారిక, రాజకీయ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా దీని షూటింగ్ విజయవాడ దగ్గర్లోనే ప్లాన్ చేశారు. సెట్స్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించింది.
ఓవైపు పవన్ డేట్లు ఇచ్చి షూటింగ్కు హాజరవుతున్నారు. మరోవైపు సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. దీంతో అనుకున్నట్లే మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. కానీ ఇటీవలి పరిణామాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ‘వీరమల్లు’ రావాల్సిన మార్చి 28కి ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు షెడ్యూల్ కావడంతో ఈ చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కాదని తేలిపోయింది.
‘రాబిన్ హుడ్’ హీరో నితిన్ పవన్ అభిమానే. ‘మ్యాడ్ స్క్వేర్’ నిర్మాత నాగవంశీకి పవన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి ‘వీరమల్లు’ టీం నుంచి ఒక క్లారిటీ వచ్చాకే వాళ్లు తమ సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించి ఉంటారు. ఐతే మార్చి 28కి తమ సినిమా రాదని ముందే ‘వీరమల్లు’ టీం ప్రకటించి ఉంటే బాగుండేది. కానీ వాళ్ల నుంచి సౌండ్ లేదు. వాళ్ల మౌనం అసలు వేసవి చివర్లో అయినా ‘వీరమల్లు’ వస్తుందా రాదా అనే సందేహాలు రేకెత్తిస్తోంది.
పవన్ చిత్రీకరణకు హాజరవుతున్నా, జోరుగా షూట్ జరుగుతున్నా.. సినిమాను చెప్పిన డేట్కి రిలీజ్ చేయకపోవడానికి కారణాలేంటో వాళ్లకు అంతుబట్టట్లేదు. ఈ విషయంలో టీం నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని.. లేదంటే అభిమానులు నైరాశ్యంలోకి వెళ్లిపోవడం, సినిమాకు ఇంకా హైప్ తగ్గిపోవడం తప్పదని అంటున్నారు.
This post was last modified on January 21, 2025 7:08 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…