Movie News

అల వైకుంఠపురంలో.. రికార్డు కూడా పోయినట్లేనా?

సంక్రాంతికి ఓ పెద్ద సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐతే ఈసారి ‘గేమ్ చేంజర్’ లాంటి పెద్ద సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని అనుకుంటే.. మిడ్ రేంజ్ మూవీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆ బాధ్యత తీసుకుంది. ఈ ఫ్యామిలీ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. వారం తిరక్కముందే ఆ చిత్రం వంద కోట్ల షేర్ మార్కును దాటేసింది.

తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా అందుకుంది. ఇప్పుడా చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీజనల్ మూవీగా రికార్డును సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఈ రికార్డు ఇప్పటిదాకా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉంది. 2020లో వచ్చిన ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.152 కోట్ల షేర్‌, రూ.250 కోట్ల గ్రాస్‌తో రీజనల్ మూవీస్‌కు సంబంధించి అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. నాన్-బాహుబలి హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్రెడీ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. షేర్ రూ.140 కోట్లకు చేరువగా ఉంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ వీకెండ్ వరకు వసూళ్ల మోత మోగించడం ఖాయం. కాబట్టి రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్ మైలురాళ్లను దాటడం.. ‘అల వైకుంఠపురములో’ను వెనక్కి నెట్టి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ రీజనల్ మూవీగా రికార్డు సృష్టించడం లాంఛనమే.

వెంకీ లాంటి సీనియర్ హీరో.. అనిల్ రావిపూడి లాంటి కామెడీ సినిమాల డైరెక్టర్‌తో జట్టు కట్టి.. తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాతో ఇలాంటి రికార్డును అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. పైగా ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. పండక్కి చూడదగ్గ ఫ్యామిలీ మూవీ అనే మోడరేట్ టాకే వచ్చింది. అయినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విరగబడి చూస్తుండడంతో వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

This post was last modified on January 21, 2025 5:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

37 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago