Movie News

అల వైకుంఠపురంలో.. రికార్డు కూడా పోయినట్లేనా?

సంక్రాంతికి ఓ పెద్ద సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐతే ఈసారి ‘గేమ్ చేంజర్’ లాంటి పెద్ద సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని అనుకుంటే.. మిడ్ రేంజ్ మూవీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆ బాధ్యత తీసుకుంది. ఈ ఫ్యామిలీ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. వారం తిరక్కముందే ఆ చిత్రం వంద కోట్ల షేర్ మార్కును దాటేసింది.

తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా అందుకుంది. ఇప్పుడా చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీజనల్ మూవీగా రికార్డును సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఈ రికార్డు ఇప్పటిదాకా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉంది. 2020లో వచ్చిన ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.152 కోట్ల షేర్‌, రూ.250 కోట్ల గ్రాస్‌తో రీజనల్ మూవీస్‌కు సంబంధించి అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. నాన్-బాహుబలి హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్రెడీ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. షేర్ రూ.140 కోట్లకు చేరువగా ఉంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ వీకెండ్ వరకు వసూళ్ల మోత మోగించడం ఖాయం. కాబట్టి రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్ మైలురాళ్లను దాటడం.. ‘అల వైకుంఠపురములో’ను వెనక్కి నెట్టి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ రీజనల్ మూవీగా రికార్డు సృష్టించడం లాంఛనమే.

వెంకీ లాంటి సీనియర్ హీరో.. అనిల్ రావిపూడి లాంటి కామెడీ సినిమాల డైరెక్టర్‌తో జట్టు కట్టి.. తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాతో ఇలాంటి రికార్డును అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. పైగా ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. పండక్కి చూడదగ్గ ఫ్యామిలీ మూవీ అనే మోడరేట్ టాకే వచ్చింది. అయినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విరగబడి చూస్తుండడంతో వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

This post was last modified on January 21, 2025 5:34 pm

Share
Show comments

Recent Posts

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

36 minutes ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

1 hour ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

4 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

5 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

8 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

10 hours ago