సంక్రాంతికి ఓ పెద్ద సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐతే ఈసారి ‘గేమ్ చేంజర్’ లాంటి పెద్ద సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని అనుకుంటే.. మిడ్ రేంజ్ మూవీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆ బాధ్యత తీసుకుంది. ఈ ఫ్యామిలీ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. వారం తిరక్కముందే ఆ చిత్రం వంద కోట్ల షేర్ మార్కును దాటేసింది.
తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా అందుకుంది. ఇప్పుడా చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీజనల్ మూవీగా రికార్డును సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఈ రికార్డు ఇప్పటిదాకా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉంది. 2020లో వచ్చిన ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్తో రీజనల్ మూవీస్కు సంబంధించి అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. నాన్-బాహుబలి హిట్గా నిలిచింది.
ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్రెడీ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. షేర్ రూ.140 కోట్లకు చేరువగా ఉంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ వీకెండ్ వరకు వసూళ్ల మోత మోగించడం ఖాయం. కాబట్టి రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్ మైలురాళ్లను దాటడం.. ‘అల వైకుంఠపురములో’ను వెనక్కి నెట్టి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ రీజనల్ మూవీగా రికార్డు సృష్టించడం లాంఛనమే.
వెంకీ లాంటి సీనియర్ హీరో.. అనిల్ రావిపూడి లాంటి కామెడీ సినిమాల డైరెక్టర్తో జట్టు కట్టి.. తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాతో ఇలాంటి రికార్డును అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. పైగా ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. పండక్కి చూడదగ్గ ఫ్యామిలీ మూవీ అనే మోడరేట్ టాకే వచ్చింది. అయినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విరగబడి చూస్తుండడంతో వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…