సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు వారం తిరక్కుండానే ఏకంగా వంద కోట్ల షేర్ సాధించడం చూసి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సందర్భంగానే సరిగ్గా పాతికేళ్ల క్రితం జరిగిన పండగ క్లాష్ ను గుర్తు చేసుకుంటున్నారు.
2000 సంవత్సరంలో జనవరి 7 చిరంజీవి అన్నయ్య రిలీజయ్యింది. భారీ హైప్ తో మెగా ఓపెనింగ్స్ తో వసూళ్ల వర్షం మొదలెట్టింది. అయితే వారం తర్వాత జనవరి 14 బాలకృష్ణ వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాం రా రెండూ ఒకేసారి థియేటర్లలో అడుగుపెట్టాయి. అప్పుడు జరిగింది అద్భుతం.
ఊహించని స్థాయిలో కలిసుందాం రా ఊరువాడా ఏకం చేసి రికార్డులు బద్దలు కొట్టింది. కుటుంబాలు తండోపతండాలుగా సినిమా హాళ్లకు వచ్చేశాయి. దెబ్బకు అన్నయ్య బాగా నెమ్మదించగా వంశోద్ధారకుడు ఫ్లాప్ టాక్ తో పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. 17 కేంద్రాల్లో కలుసుందాం రా సిల్వర్ జూబ్లీ ఆడటం సరికొత్త మైలురాయి.
దానికన్నా ముందు 76 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. అన్నయ్య కూడా బాగానే ఆడింది కానీ వెంకీ మూవీని క్రాస్ చేయలేకపోయింది. ఒక రోజు గ్యాప్ తో జనవరి 15 దాసరి సమ్మక్క సారక్క సైతం చాలా క్రేజ్ తో వచ్చింది. కానీ కలిసుందాం రా హవా ముందు నిలవలేదు.
ఇప్పుడు వర్తమానానికి వస్తే ముందు గేమ్ చేంజర్ వచ్చింది. అంచనాలు అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. కానీ డాకు మహారాజ్ హిట్ టాక్ తో నూటా యాభై కోట్ల గ్రాస్ సాధించింది కానీ సంక్రాంతికి వస్తున్నాంకి స్ట్రాంగ్ కాంపిటీటర్ కాలేకపోయింది. అప్పుడు చిరంజీవి, వెంకీ విజయాలు సాధిస్తే ఇప్పుడు బాలకృష్ణ, వెంకీ పండగ జెండాలు పాతారు.
కలిసుందాం రా నాటి యుఫోరియాని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇది, సంక్రాంతికి వస్తున్నాం రెండూ ఒకే డేట్ కి రిలీజ్ కావడం కాకతాళీయం. నాన్ రాజమౌళి, నాన్ పుష్ప 2లను లక్ష్యంగా పెట్టుకున్న సంక్రాంతికి వస్తున్నాం ఇంకేం అద్భుతాలు చేస్తుందో చూడాలి.
This post was last modified on January 21, 2025 4:09 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…