ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సినిమాకు సరిపడా మెటీరియల్ ని సిద్ధం చేస్తోంది. ముంబై పోలీసులు చేస్తున్న విచారణలో బయట పడుతున్న విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక సిరీస్ ప్రకారం చూస్తే కొంతమేరకు ఇది అర్థమవుతుంది.
సైఫ్ మీద అటాక్ చేసిన దుండగుడు మహమ్మద్ షరీఫుల్. ఏడు నెలల క్రితం డౌకీ నది ద్వారా బంగ్లాదేశ్ (ఝులొకటి జిల్లా) నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. విజయ్ దాస్ గా పేరు మార్చుకుని ముంబై చేరుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి పేరు మీద సిమ్ కార్డు తీసుకున్నాడు.
ఆధార్ పొందేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ముంబైలో కూలి కోసం చిన్నా చితకా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. జనవరి 16 సైఫ్ ఉండే సద్గురు అపార్ట్ మెంట్ చేరుకున్నాడు. ఎనిమిది అంతస్థుల వరకు మెట్లు ఎక్కాక పన్నెండో ఫ్లోర్ కు పైపు పట్టుకుని చేరుకున్నాడు.
సైఫ్ బాత్ రూమ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించాడు. చిన్న కొడుకు జెహ్ గదిలో దూరగా సహాయంగా ఉన్న కేర్ టేకర్ కేకలు విని సైఫ్ పరుగులు పెడుతూ వచ్చాడు. పై ఫ్లోర్ లో మగ సహాయకులు నలుగురు ఉన్నప్పటికీ భయంతో కిందకు రాలేదు. దీంతో ఆయాగా ఉన్న ఆడమనిషిని కోటి డిమాండ్ చేశాడు విజయ్ దాస్ అలియాస్ షరీఫుల్.
సైఫ్ అక్కడికి చేరుకున్నాక కత్తితో దాడి చేశాడు. తీవ్ర పెనుగులాట తర్వాత అతన్ని ఒక గదిలో బంధించారు కానీ వచ్చిన దారినే తిరిగి షరీఫుల్ తప్పించుకున్నాడు. ఇంట్లో వాళ్ళు సైఫ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం 300 పోలీసులు 600 సిసి టీవీ ఫుటేజీలు చూసి ఇతన్ని పట్టుకున్నారు.
అంతకన్నా ముందు రోజు రాత్రి వర్లీలోని ఒక పావ్ భాజీ సెంటర్ లో పరోటా తిని నీళ్లు తాగి యుపిఐ పేమెంట్ చేశాడు. అప్పుడు ఇతనున్న ప్రాంతం తెలుసుకోవడానికి అవకాశం చిక్కింది. ఠాణేలోని హీరానందని ఎస్టేట్ వద్ద లేబర్ క్యాంప్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇన్వెస్టిగేషన్ సీన్ రీక్రియేషన్ లో ఇప్పటిదాకా బయటికొచ్చిన ట్విస్టులివి. ఇంకెన్ని రానున్నాయో. తాజాగా ఇవాళే సైఫ్ హాప్సిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…