Movie News

పవిత్ర వచ్చాక నరేష్ ‘టైటానిక్’ ఒడ్డుకు..


సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారిన కన్నడ నటి పవిత్ర లోకేష్‌తో ఆయన బంధం వివాదానికి దారి తీసింది. నరేష్‌కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆయన భార్య రమ్య ఈ విషయంలో ఎంత గొడవ చేసిందో.. దీని మీద కొన్నాళ్ల పాటు మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే.

ఐతే తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. నరేష్.. పవిత్రతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్ కెరీర్ పరంగా టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా వెలుగొందుతూనే వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతున్నారు. సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేకరులను కలిసిన ఆయనకు.. పవిత్ర లోకేష్ గురించి ప్రశ్న ఎదురైంది.

పవిత్ర మీ జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అని అడగ్గా, ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “పవిత్ర నా జీవితంలోకి వచ్చాక టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరింది. సినిమా వాళ్లుగా మాది విభిన్నమైన జీవితం. మేం చెడ్డ వాళ్లం కాదు. మాకు ఎమోషన్లు ఎక్కువ. మా సమయాన్ని వ్యక్తిగత జీవితం కంటే సినిమా కోసమే ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుంది. అలాంటపుడు మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. నా అదృష్టం కొద్దీ ఇదే ఇండస్ట్రీకి చెందిన పవిత్ర నా జీవితంలోకి వచ్చింది. కాబట్టి ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఆమె రావడం వల్ల టైటానిక్ షిప్ తీరం చేరినట్లయింది” అని నరేష్ తెలిపారు.

ఇక తాను భవిష్యత్తులో ఏదో ఒక రోజు డైరెక్షన్ చేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. గతంలో ఒక కథ రాశానని.. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ ఛాన్స్ మిస్సయిందని.. త్వరలో ఆ కల తీర్చకుంటానని ఆయనన్నారు. తన తల్లి బయోపిక్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

This post was last modified on January 20, 2025 3:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago