సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారిన కన్నడ నటి పవిత్ర లోకేష్తో ఆయన బంధం వివాదానికి దారి తీసింది. నరేష్కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆయన భార్య రమ్య ఈ విషయంలో ఎంత గొడవ చేసిందో.. దీని మీద కొన్నాళ్ల పాటు మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే.
ఐతే తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. నరేష్.. పవిత్రతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్ కెరీర్ పరంగా టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా వెలుగొందుతూనే వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతున్నారు. సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేకరులను కలిసిన ఆయనకు.. పవిత్ర లోకేష్ గురించి ప్రశ్న ఎదురైంది.
పవిత్ర మీ జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అని అడగ్గా, ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “పవిత్ర నా జీవితంలోకి వచ్చాక టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరింది. సినిమా వాళ్లుగా మాది విభిన్నమైన జీవితం. మేం చెడ్డ వాళ్లం కాదు. మాకు ఎమోషన్లు ఎక్కువ. మా సమయాన్ని వ్యక్తిగత జీవితం కంటే సినిమా కోసమే ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుంది. అలాంటపుడు మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. నా అదృష్టం కొద్దీ ఇదే ఇండస్ట్రీకి చెందిన పవిత్ర నా జీవితంలోకి వచ్చింది. కాబట్టి ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఆమె రావడం వల్ల టైటానిక్ షిప్ తీరం చేరినట్లయింది” అని నరేష్ తెలిపారు.
ఇక తాను భవిష్యత్తులో ఏదో ఒక రోజు డైరెక్షన్ చేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. గతంలో ఒక కథ రాశానని.. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ ఛాన్స్ మిస్సయిందని.. త్వరలో ఆ కల తీర్చకుంటానని ఆయనన్నారు. తన తల్లి బయోపిక్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
This post was last modified on January 20, 2025 3:03 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…