సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారిన కన్నడ నటి పవిత్ర లోకేష్తో ఆయన బంధం వివాదానికి దారి తీసింది. నరేష్కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆయన భార్య రమ్య ఈ విషయంలో ఎంత గొడవ చేసిందో.. దీని మీద కొన్నాళ్ల పాటు మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే.
ఐతే తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. నరేష్.. పవిత్రతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్ కెరీర్ పరంగా టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా వెలుగొందుతూనే వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతున్నారు. సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేకరులను కలిసిన ఆయనకు.. పవిత్ర లోకేష్ గురించి ప్రశ్న ఎదురైంది.
పవిత్ర మీ జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అని అడగ్గా, ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “పవిత్ర నా జీవితంలోకి వచ్చాక టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరింది. సినిమా వాళ్లుగా మాది విభిన్నమైన జీవితం. మేం చెడ్డ వాళ్లం కాదు. మాకు ఎమోషన్లు ఎక్కువ. మా సమయాన్ని వ్యక్తిగత జీవితం కంటే సినిమా కోసమే ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుంది. అలాంటపుడు మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. నా అదృష్టం కొద్దీ ఇదే ఇండస్ట్రీకి చెందిన పవిత్ర నా జీవితంలోకి వచ్చింది. కాబట్టి ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఆమె రావడం వల్ల టైటానిక్ షిప్ తీరం చేరినట్లయింది” అని నరేష్ తెలిపారు.
ఇక తాను భవిష్యత్తులో ఏదో ఒక రోజు డైరెక్షన్ చేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. గతంలో ఒక కథ రాశానని.. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ ఛాన్స్ మిస్సయిందని.. త్వరలో ఆ కల తీర్చకుంటానని ఆయనన్నారు. తన తల్లి బయోపిక్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…