గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి క్లాసిక్స్ అందించిన దర్శకుడతను. తక్కువ సినిమాలతోనే లెజెండరీ స్టేటస్ అందుకున్న ఈ దర్శకుడు.. అరంగేట్రం చేసిన పాతికేళ్ల తర్వాత కూడా ట్రెండీగా సినిమాలు తీస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఐతే తాను గతంలో డైరెక్ట్ చేసిన ఓ సినిమాతో తనకు సంబంధం లేనట్లు తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్ సంచలనం రేపుతోంది. గౌతమ్.. ధనుష్ హీరోగా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ అనే సినిమా తీశాడు. గౌతమ్ గత కొన్ని చిత్రాల మాదిరే ఇది కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొని ఆలస్యంగా, 2019లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో గౌతమ్ మార్కు కనిపించలేదన్న విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఆ సినిమాను గౌతమ్ డిస్ ఓన్ చేసుకోవడం గమనార్హం.
తన దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా రానున్న కొత్త చిత్రం ‘డొమినిక్’ విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ధనుష్తో తన సినిమా గురించి అడిగితే షాకింగ్ కామెంట్స్ చేశాడు గౌతమ్ మీనన్. “మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ సినిమా గురించి నేను మరిచిపోయాను. దాని గురించి నాకు ఏమీ గుర్తు లేదు. అందులోని ఒక పాట మాత్రమే గుర్తుంది. అది నా సినిమా కాదు. వేరే ఎవరిదైనా అయ్యుండొచ్చు” అని గౌతమ్ వ్యాఖ్యానించాడు.
గౌతమ్ నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ విడుదల సమస్యగా మారిన పరిస్థితుల్లో.. బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణను హీరో ధనుషే పూర్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే అప్పుడు జరిగిన ప్రచారం నిజమే అని అర్థమవుతోంది. మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం గౌతమ్, ధనుష్ల ఫిల్మోగ్రఫీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
This post was last modified on January 20, 2025 3:00 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…