గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి క్లాసిక్స్ అందించిన దర్శకుడతను. తక్కువ సినిమాలతోనే లెజెండరీ స్టేటస్ అందుకున్న ఈ దర్శకుడు.. అరంగేట్రం చేసిన పాతికేళ్ల తర్వాత కూడా ట్రెండీగా సినిమాలు తీస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఐతే తాను గతంలో డైరెక్ట్ చేసిన ఓ సినిమాతో తనకు సంబంధం లేనట్లు తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్ సంచలనం రేపుతోంది. గౌతమ్.. ధనుష్ హీరోగా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ అనే సినిమా తీశాడు. గౌతమ్ గత కొన్ని చిత్రాల మాదిరే ఇది కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొని ఆలస్యంగా, 2019లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో గౌతమ్ మార్కు కనిపించలేదన్న విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఆ సినిమాను గౌతమ్ డిస్ ఓన్ చేసుకోవడం గమనార్హం.
తన దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా రానున్న కొత్త చిత్రం ‘డొమినిక్’ విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ధనుష్తో తన సినిమా గురించి అడిగితే షాకింగ్ కామెంట్స్ చేశాడు గౌతమ్ మీనన్. “మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ సినిమా గురించి నేను మరిచిపోయాను. దాని గురించి నాకు ఏమీ గుర్తు లేదు. అందులోని ఒక పాట మాత్రమే గుర్తుంది. అది నా సినిమా కాదు. వేరే ఎవరిదైనా అయ్యుండొచ్చు” అని గౌతమ్ వ్యాఖ్యానించాడు.
గౌతమ్ నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ విడుదల సమస్యగా మారిన పరిస్థితుల్లో.. బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణను హీరో ధనుషే పూర్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే అప్పుడు జరిగిన ప్రచారం నిజమే అని అర్థమవుతోంది. మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం గౌతమ్, ధనుష్ల ఫిల్మోగ్రఫీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
This post was last modified on January 20, 2025 3:00 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…