యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు లోను కావడం విచిత్రం. సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం 2014లో ఈ కలయికలో ఎవడు వచ్చింది. వంశి పైడిపల్లి దర్శకత్వంలో అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోయారు. చాలా బ్రేకులు పడ్డాయి. ప్రొడ్యూసర్ గా పీక్స్ ఉన్న టైంలోనే దిల్ రాజుకి దీంతో సమస్యలు వచ్చాయి. ఎట్టకేలకు రిలీజ్ చేసి కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకున్నారు కానీ ఫ్యాన్స్ ఆశించినట్టు రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ పడలేదు. కట్ చేస్తే ఇప్పుడు గేమ్ ఛేంజర్ వంతు.
దర్శకుడు, టీమ్ తో పాటు ఈసారి ఫలితం కూడా మారింది. మూడేళ్ళ నిర్మాణం, చరణ్ విలువైన సమయం, 50వ సినిమాగా ఎస్విసి సంస్థ మైలురాయి ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఎవడు చెప్పుకోవడానికి విజయం సాధించింది కానీ గేమ్ ఛేంజర్ దానికి నోచుకోలేదు. దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు కనక అదయ్యాక గేమ్ ఛేంజర్ లెక్కల మీద దృష్టి పెట్టొచ్చు. షాక్ ఇచ్చే నెంబరే నష్టంగా మిగలనుంది. దీన్ని రికవర్ చేయాలనే ఉద్దేశం మూడో సినిమా రాజు గారి బ్యానర్ లోనే చేసేందుకు రామ్ చరణ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వినికిడి.
ఇంకా ప్రకటన రాలేదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం బాగానే టైం పడుతుంది. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్షన్లో నిర్మాణంలో ఉన్న ఆర్సి 16 అయ్యాక సుకుమార్ తో ఆర్సి 17 మొదలవుతుంది. ఇవి రెండు అయ్యేలోపు ఏదైనా కథ, దర్శకుడు కుదిరితే రామ్ చరణ్ దిల్ రాజుకో సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చలే తప్ప నిర్ధారణగా మ్యాటర్ తెలియాల్సి ఉంది. చిన్న ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లి హైదరాబాద్ కు వచ్చేసిన చరణ్ త్వరలోనే ఆర్సి 16 కొత్త షెడ్యూల్ లో అడుగు పెట్టబోతున్నారు. అనుకున్న టైంకన్నా ముందే రిలీజ్ చేయొచ్చని సమాచారం.
This post was last modified on January 18, 2025 11:20 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…