నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం పట్ల పెద్ద చర్చే జరుగుతోంది. దానికి చిరంజీవి తనను ఈ ప్రసంగం కదిలించిందంటూ స్పందించడం, బదులుగా తమన్ భగవద్గీత శ్లోకాన్ని ఉటంకిస్తూ కృతజ్ఞతలు చెప్పడం జరిగాయి. పుట్టిన బిడ్డను కళ్ళు తెరవక ముందే హత్య చేయొద్దంటూ తమన్ చెప్పడం గేమ్ ఛేంజర్ గురించేనని మెగా ఫ్యాన్స్ కే కాదు సగటు ప్రేక్షకులకూ అర్థమైపోయింది. ఎందుకంటే బాలయ్య, వెంకీ సినిమాలకు ఏ ఆటంకం రాలేదు.
నిశితంగా గమనిస్తే సమస్య కేవలం గేమ్ ఛేంజర్ దే కాదు. హెచ్డి పైరసీ ప్రింట్ లీక్ కావడం ఎప్పుడో అత్తారింటికి దారేది టైంలోనే చూశాం. ట్రోలింగ్ అంటే గుంటూరు కారంతో మొదలుపెట్టి దేవర దాకా దీని బారిన పడని హీరో ఎవరూ లేరు. సీనియర్లకు సైతం ఈ బాధ తప్పలేదు. భోళాశంకర్ టైంలో చిరంజీవి, రూలర్ సమయంలో బాలకృష్ణ అందరూ చవిచూశారు. మహేష్ బాబు మెసేజులు ఇచ్చే సినిమాలు చేసినా గేలి చేసినవాళ్లు కోకొల్లలు. కావాలనే డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో తప్పుడు చర్యలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకపోవడం రాను రాను అనర్థాలు పెరిగిపోయేలా చేస్తోంది.
మొన్నో లోకల్ ఛానల్ లో గేమ్ ఛేంజర్ ప్రసారం చేస్తే తప్పు చేసిన వాళ్ళను పట్టుకున్నారు కానీ నిజంగా వాళ్లకు శిక్షలు పడతాయా అంటే సమాధానం దొరకడం కష్టం. పైరసీ, ట్రోలింగ్, వ్యక్తిత్వ హననాలు, మార్ఫింగ్, డీప్ ఫేక్ వీడియోలు ఒకటా రెండా పరిశ్రమ మీద జరుగుతున్న ముప్పేట దాడి అంతా ఇంతా కాదు. తప్పు చేస్తున్న వాళ్ళు ధైర్యంగా తమ పనులు కొనసాగిస్తుంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది. ఇకనైనా ప్రభుత్వాలు వీటిపట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. చైనా, జపాన్ తరహాలో ఇండస్ట్రీని కాపాడేందుకు వ్యవస్థలు మారాలంటున్నారు. వెంటనే కాకపోయినా భవిష్యత్తులో అయినా జరగాలి.
This post was last modified on January 18, 2025 9:13 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…