ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. సంక్రాంతికి వస్తున్నాంతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ మాస్ వర్గాలను ఆకట్టుకోవడంలో బాలయ్య మరోసారి విజయం సాధించారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఊర్వశి రౌతేలా ఆనందం మాములుగా లేదు. నిడివి పరంగా తక్కువ స్పేస్ దొరికినప్పటికీ గ్లామర్ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దబిడి దిబిడి పాటలో వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీశాయి. గతంలో వాల్తేరు వీరయ్యలో వేరీజ్ ది పార్టీలో చిరంజీవితో ఆడిపాడింది ఈ భామనే.
ఇదంతా ఓకే కానీ క్షమాపణ వ్యవహారం ఏంటో చూద్దాం. ఇటీవలే ఒక ముంబై మీడియా ప్రతినిధి ఊర్వశి రౌతేలాని ఇంటర్వ్యూ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి గురించి సుదీర్ఘమైన ప్రశ్న వేసి మీ స్పందన ఏంటో తెలియజేయమని చెప్పాడు. దానికి ఆమె సమాధానమిస్తూ బాధగా ఉందని, త్వరగా కోలుకోవాలని పొడిపొడిగా చెప్పేసి వెంటనే డాకు మహారాజ్ హిట్ అయిన సందర్భంగా తనకు తల్లి తండ్రులు ఇచ్చిన ఖరీదైన కానుకల గురించి చెప్పడం మొదలుపెట్టింది. రోలెక్స్ వాచ్, డైమండ్ రింగ్ గురించి గొప్పగా చెప్పింది. దీంతో ఆ వీడియో కాస్తా విపరీతంగా వైరలైపోయి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
సందర్భం లేకుండా సైఫ్ గురించి మాట్లాడమంటే గిఫ్టుల గురించి చెప్పుకోవడం ఏమిటంటూ నెటిజెన్లు తలంటారు. దీంతో జరిగిన పొరపాటును గుర్తించిన ఊర్వశి రౌతేలా వెంటనే ఇన్స్ టా వేదికగా క్షమాపణ చెప్పింది. జరిగిన ఘటన తాలూకు తీవ్రత తెలియకుండా వేరే ప్రస్తావన చేశానని, దయచేసి క్షమించమని, ఈ మెసేజ్ సైఫ్ దాకా చేరుతుందని కోరుకుంటున్నట్టు అందులో పేర్కొంది. ఆ మధ్య తెలుగు ట్రోలింగ్స్ అర్థం చేసుకోలేక వాటిని షేర్ చేసుకుంది కూడా ఊర్వశినే. ఏదైతేనేం విజయానందంతో తానేం చేస్తోందో ఊర్వశి చెక్ చేసుకుంటున్నట్టు లేదు. దెబ్బకు ఈసారి మరింత జాగ్రత్తగా ఉండటం ఖాయం.
This post was last modified on January 18, 2025 11:56 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…