సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్ ఇండియా మూవీ మీద ప్రభావం చూపించేంత. కొన్నిసార్లు హద్దులు దాటి పరస్పరం మాటల దాడులతోనే వ్యక్తిత్వ హననం చేసుకునేంత.
హీరోలు ఇలాంటివి చేయొద్దంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతూనే ఉన్నా ఫ్యాన్స్ చెవులకు ఎక్కడం లేదు. అదేదో ఘనకార్యంలాగా పదే పదే వాటికే పాల్పడుతున్నారు. డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమన్ దీని గురించి ఓపెనయ్యాడు. సినిమాలను చంపొద్దంటూ బహిరంగంగా విన్నవించుకున్నాడు.
సక్సెస్ వస్తే అందులో ఉండే ఆనందమే వేరని కానీ దాన్ని అందుకోకుండా తప్పుడు ఉద్దేశాలతో విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దంటూ హితవు పలికాడు. తమన్ చెప్పింది నిజంగా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. నెగటివ్ ట్రెండ్స్ వల్ల మనస్థాపం కలుగుతోందని, నిర్మాతలను గౌరవించడం మన బాధ్యతంటూ మంచి విషయాలు చెప్పాడు.
గత కొన్ని నెలలుగా ఈ ధోరణి తీవ్ర రూపం దాల్చిన మాట వాస్తవం. దేవర, కల్కి నుంచి మొన్న గేమ్ ఛేంజర్ దాకా ఎన్నో పెద్ద సినిమాలను లక్ష్యంగా చేసుకున్న కొందరు యాంటీ ఫ్యాన్స్ ఒక ప్రమాదరకమైన సంస్కృతికి బీజం వేశారు. అదిప్పుడు చెట్టవుతోంది.
మొగ్గలోనే తుంచితే మంచిదనేది తమన్ అభిప్రాయం. లేదంటే ఇది తర్వాతి జనరేషన్లకు పాకిపోయి వాళ్ళు కూడా ఇదే అలవాటు చేసుంటారు. మేం మేం బాగుంటామని హీరోలు ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తున్నారు. గుంటూరు కారం ఆడియో టైం తమన్ వీటికి బలయ్యాడు.
జరగండి జరగండి లీక్ లోనూ ఇలాగే చేశారు. లెక్కలేనన్ని సార్లు టార్గెట్ గా పెట్టుకుని మరీ ట్రోల్ చేశారు. చాలా సహనంతో భరిస్తూ వచ్చిన తమన్ డాకు వేడుకలో ఓపెనయ్యాడు. ఎవరినీ తిట్టకుండా జీవితంలో ఏం చేయాలనే స్పష్టత యువతకు ఉండాలని కోరాడు. విని ఆచరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 17, 2025 9:51 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…