ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర స్టేషనరీ ఉంటే చాలు స్క్రిప్ట్ లు రాసేవాళ్ళు. పరుచూరి, సత్యానంద్, జంధ్యాల, త్రివిక్రమ్ తదితరులంతా దీన్ని ఫాలో అయినవాళ్లే. కానీ ట్రెండ్ పేరుతో చాలా పద్ధతులు వచ్చాయి.
పిచ్ డెక్, పవర్ పాయింట్, సెల్టెక్స్ అంటూ రకరకాల సాఫ్ట్ వేర్లు వాడుతున్నారు. వాటి ద్వారా కథలను ఫిల్టర్ చేస్తున్న దర్శక నిర్మాతలు పరిశ్రమలో చాలా ఉన్నారు. ఒకవేళ ఇవి వాడటం రాకపోతే అవకాశాలు పోగొట్టుకున్న రైటర్లు బోలెడు. కానీ అసలు ముడిసరుకైనా క్రియేటివిటీ మాత్రం మెదడులో నుంచే రావాలిగా.
దర్శకుడు అనిల్ రావిపూడి ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ లో చెప్పిన విషయాలు చెంపపెట్టులా ఉన్నాయి. స్టోరీ ఇలాగే రాయాలి, స్క్రీన్ ప్లే స్టడీ, క్యారెక్టర్ ఆర్క్ లాంటి క్లిష్టమైన పదాలు తనకు తెలియవని, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఏం కావాలో అవి మాత్రమే చూస్తాను తప్పించి మిగిలినవి తనకు అవసరం లేదని చెప్పేశాడు.
ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతానని కుండబద్దలు కొట్టేశాడు. ఈలలు, చప్పట్లు, కన్నీళ్లు ఏ ఎమోషన్ అయినా ఆడియన్స్ లో నుంచి చూసినవాణ్ణి కాబట్టే అవన్నీ అక్కడే నేర్చుకున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. ఎనిమిది వరస హిట్లు కొట్టిన డైరెక్టర్ గా అతను చెప్పిన దాంట్లో నిజముంది.
ఇండస్ట్రీలోనే కాదు జనంలోనూ మనల్ని తీసుకెళ్లేది సక్సెసే. అంత పెద్ద నిర్మాత దిల్ రాజు, శిరీష్ లే అనిల్ రావిపూడిని ఆకాశానికి ఎత్తుతున్నారంటే ఏ స్థాయిలో మేజిక్ చేసి ఆ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నాడో వేరే చెప్పాలా. చిరంజీవితో చేయబోతున్న రావిపూడి మెగాస్టార్ ని ఎలా చూపిస్తాడనే ఆసక్తి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది.
ఈ నెలలోనే ప్రకటన వచ్చి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. 2026 సంక్రాంతి విడుదలనే ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది. ఎన్ని ప్యాన్ ఇండియా సినిమాలు తీశామన్నది కాదు లోకల్ గా తీసినా గ్లోబల్ బ్లాక్ బస్టర్లు కొట్టడమే ప్రధానంగా అనిల్ దూసుకుపోతున్నాడు.
This post was last modified on January 17, 2025 7:24 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…