ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్ సి దానికి మినహాయింపుగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన మదగజరాజా 12 సంవత్సరాల తర్వాత రిలీజైయ్యింది. విశాల్ లాంటి పేరున్న హీరోతో చేసినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల దశాబ్దానికి పైగానే ల్యాబులో మగ్గుతూ వచ్చింది.
ఆఖరికి మొన్న పొంగల్ కి అజిత్ విడాముయార్చి తప్పుకోవడంతో మదగజరాజకు లైన్ క్లియర్ చేసిన నిర్మాతలు ఆఘమేఘాల మీద విడుదల చేశారు. కట్ చేస్తే తమిళనాడులో పండగ సూపర్ హిట్ గా నిలిచి విజయం అందుకుంది.
ట్విస్ట్ ఏంటంటే మదగజరాజ రొటీన్ ఫార్ములాతో సాగే మాస్ ఎంటర్ టైనర్. అయినా సరే బలమైన పోటీ లేకపోవడంతో విశాల్ బొమ్మని జనం ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఇరవై కోట్ల వసూళ్లు దాటేయగా ఫైనల్ రన్ అయ్యేలోపు 40 నుంచి 50 కోట్ల దాకా వచ్చేలా ఉంది.
ఇదిలా ఉండగా దర్శకుడు సుందర్ సి సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తాను ఎంత మంచి హిట్లిచ్చినా బెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకులను మెప్పించడంలో తాను ఫెయిల్ కానప్పుడు ఎందుకు గుర్తించడం లేదని చెప్పుకున్నారు. ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు.
సుందర్ మరీ రొటీన్ అంశాలతో సేఫ్ గేమ్ ఆడతారు. గత ఏడాది బాక్ అరణ్మయి 4లోనూ అదే చేశారు. గ్లామర్, హారర్ మీదే ఆధారపడుతూ క్రియేటివిటీకి చరమగీతం పాడారు. మదగజరాజా కూడా అంతే. వీటికి ముందు ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. కెరీర్ మొత్తం మీద ఒక్క అరుణాచలం మాత్రమే గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్.
రజినీకాంత్ తో చేసిన తర్వాత పెద్ద స్థాయికి చేరుకోలేకపోవడం సుందర్ సి దురదృష్టం. దీన్ని విశ్లేషించుకోకుండా తనను గుర్తించడం లేదనేదీ సరికాదని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా మళ్ళీ దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో అరణ్మయి 5 రాసుకోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on January 17, 2025 3:49 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…