ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్ సి దానికి మినహాయింపుగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన మదగజరాజా 12 సంవత్సరాల తర్వాత రిలీజైయ్యింది. విశాల్ లాంటి పేరున్న హీరోతో చేసినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల దశాబ్దానికి పైగానే ల్యాబులో మగ్గుతూ వచ్చింది.
ఆఖరికి మొన్న పొంగల్ కి అజిత్ విడాముయార్చి తప్పుకోవడంతో మదగజరాజకు లైన్ క్లియర్ చేసిన నిర్మాతలు ఆఘమేఘాల మీద విడుదల చేశారు. కట్ చేస్తే తమిళనాడులో పండగ సూపర్ హిట్ గా నిలిచి విజయం అందుకుంది.
ట్విస్ట్ ఏంటంటే మదగజరాజ రొటీన్ ఫార్ములాతో సాగే మాస్ ఎంటర్ టైనర్. అయినా సరే బలమైన పోటీ లేకపోవడంతో విశాల్ బొమ్మని జనం ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఇరవై కోట్ల వసూళ్లు దాటేయగా ఫైనల్ రన్ అయ్యేలోపు 40 నుంచి 50 కోట్ల దాకా వచ్చేలా ఉంది.
ఇదిలా ఉండగా దర్శకుడు సుందర్ సి సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తాను ఎంత మంచి హిట్లిచ్చినా బెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకులను మెప్పించడంలో తాను ఫెయిల్ కానప్పుడు ఎందుకు గుర్తించడం లేదని చెప్పుకున్నారు. ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు.
సుందర్ మరీ రొటీన్ అంశాలతో సేఫ్ గేమ్ ఆడతారు. గత ఏడాది బాక్ అరణ్మయి 4లోనూ అదే చేశారు. గ్లామర్, హారర్ మీదే ఆధారపడుతూ క్రియేటివిటీకి చరమగీతం పాడారు. మదగజరాజా కూడా అంతే. వీటికి ముందు ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. కెరీర్ మొత్తం మీద ఒక్క అరుణాచలం మాత్రమే గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్.
రజినీకాంత్ తో చేసిన తర్వాత పెద్ద స్థాయికి చేరుకోలేకపోవడం సుందర్ సి దురదృష్టం. దీన్ని విశ్లేషించుకోకుండా తనను గుర్తించడం లేదనేదీ సరికాదని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా మళ్ళీ దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో అరణ్మయి 5 రాసుకోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on January 17, 2025 3:49 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…