ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్ సి దానికి మినహాయింపుగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన మదగజరాజా 12 సంవత్సరాల తర్వాత రిలీజైయ్యింది. విశాల్ లాంటి పేరున్న హీరోతో చేసినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల దశాబ్దానికి పైగానే ల్యాబులో మగ్గుతూ వచ్చింది.
ఆఖరికి మొన్న పొంగల్ కి అజిత్ విడాముయార్చి తప్పుకోవడంతో మదగజరాజకు లైన్ క్లియర్ చేసిన నిర్మాతలు ఆఘమేఘాల మీద విడుదల చేశారు. కట్ చేస్తే తమిళనాడులో పండగ సూపర్ హిట్ గా నిలిచి విజయం అందుకుంది.
ట్విస్ట్ ఏంటంటే మదగజరాజ రొటీన్ ఫార్ములాతో సాగే మాస్ ఎంటర్ టైనర్. అయినా సరే బలమైన పోటీ లేకపోవడంతో విశాల్ బొమ్మని జనం ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఇరవై కోట్ల వసూళ్లు దాటేయగా ఫైనల్ రన్ అయ్యేలోపు 40 నుంచి 50 కోట్ల దాకా వచ్చేలా ఉంది.
ఇదిలా ఉండగా దర్శకుడు సుందర్ సి సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తాను ఎంత మంచి హిట్లిచ్చినా బెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకులను మెప్పించడంలో తాను ఫెయిల్ కానప్పుడు ఎందుకు గుర్తించడం లేదని చెప్పుకున్నారు. ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు.
సుందర్ మరీ రొటీన్ అంశాలతో సేఫ్ గేమ్ ఆడతారు. గత ఏడాది బాక్ అరణ్మయి 4లోనూ అదే చేశారు. గ్లామర్, హారర్ మీదే ఆధారపడుతూ క్రియేటివిటీకి చరమగీతం పాడారు. మదగజరాజా కూడా అంతే. వీటికి ముందు ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. కెరీర్ మొత్తం మీద ఒక్క అరుణాచలం మాత్రమే గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్.
రజినీకాంత్ తో చేసిన తర్వాత పెద్ద స్థాయికి చేరుకోలేకపోవడం సుందర్ సి దురదృష్టం. దీన్ని విశ్లేషించుకోకుండా తనను గుర్తించడం లేదనేదీ సరికాదని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా మళ్ళీ దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో అరణ్మయి 5 రాసుకోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on January 17, 2025 3:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…