సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల ప్రవాహం చూస్తుంటే అరాచకం మాట చాలా చిన్నదనిపిస్తోంది. జనవరి ప్రారంభంలో పండక్కు ముందు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పోటీని తట్టుకుని వెంకీ మామ నిలబడగలడా అనే అనుమానాలు పూర్తిగా చెల్లాచెదురు చేస్తూ కేవలం 3 రోజులకే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లకు పైగా గ్రాస్ దాటేయడం మాములు రికార్డు కాదు. వెంకీ మామ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా కూడా ఇదే.
అందులోనూ కాంపిటీషన్ వల్ల వెంకటేష్ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకలేదు. అప్పటికప్పుడు డిమాండ్ కు తగ్గట్టు డిస్ట్రిబ్యూటర్లు షోలు పెంచుకుంటూ పోతున్నా సరే దాదాపు అన్ని కేంద్రాల్లో టికెట్లు దొరకడం కష్టమనేలా పరిస్థితి మారిపోయింది.
హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా ఇదే సీన్ కనిపిస్తోంది. కొన్ని బిసి సెంటర్లలో ఎక్స్ ట్రా కుర్చీలు వేసినా సరిపోవడం లేదు. ఇంకొన్ని కేంద్రాల్లో గేమ్ ఛేంజర్ షోలు సంక్రాంతికి వస్తున్నాంకి ఇచ్చి సర్దుబాటు చేస్తున్నా సరే టికెట్లు దొరక్క ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్న తీరు మాములుగా లేదు. ఖచ్చితంగా మొదటి వారం చూసేయాలన్న పట్టుదలతో తండోపతండాలుగా వెళ్తున్నారు. డాకు మహారాజ్ అంత పాజిటివ్ టాక్ తో మాస్ ని ఆకట్టుకుంటున్నా వెంకీ మూవీ వల్ల వెనుకబడటం బాక్సాఫీస్ వద్ద అరుదుగా కనిపించే పరిణామం.
చూస్తుంటే మొదటి వారం అయ్యేలోపే సంక్రాంతికి వస్తున్నాం రెండు వందల కోట్లు దాటేయడం ఖాయం. చాల ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి ప్రవేశించాయి. ఏపిలో టికెట్ ధరల హైక్ ఉన్నా దాని ప్రభావం ఏ మాత్రం లేదు. పది రోజుల తర్వాత తిరిగి మాములు రేట్లు మొదలైతే ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ పై స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆదివారం దాకా ఈ ర్యాంపేజ్ తగ్గే ఛాన్స్ లేదు. బుక్ మై షోలో ఎవరికి అందనంత ఎత్తులో రోజుకు మూడు నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్మేస్తున్న ఈ బ్లాక్ బస్టర్ పరుగు ఇప్పట్లో ఆగేలా లేదు. టైటిల్ కు తగ్గట్టే జనాలు వస్తున్నాం వస్తున్నాం అంటూ థియేటర్లు నింపేస్తున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…