సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ నుంచి మొదటి ఆడియో సింగల్ విడుదలయ్యింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయ్యాక రిలీజవుతున్న మొదటి సినిమాగా దీని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఇది.
తొలుత సంక్రాంతికి అనుకున్నారు కానీ గేమ్ ఛేంజర్ తో పాటు ఇతర చిత్రాల హడావిడి ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఈ రోజు చెప్పిన టైంకే ఎలాంటి వాయిదాలు లేకుండా మాట వినాలి గురుడా మాట వినాలి పాట వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత స్వయంగా పాడటం ఈ సాంగ్ ప్రత్యేకత. తెలుగులో స్వంతంగా గానం చేయగా మిగిలిన భాషల్లో ఏఐ సాంకేతికత వాడి అచ్చం పవన్ గాత్రానికి దగ్గరగా మ్యాచయ్యేలా వేరే సింగర్స్ సహాయం తీసుకున్నారు. పెంచల్ దాస్ సాహిత్యం సమకూర్చగా మాట వినాలి అంటూ మంచి చెడుల ప్రస్తావనను, అడవిలో పరిస్థితులతో పోలుస్తూ వర్ణించిన విధానం కొత్తగా ఉంది. మాట వినకపోతే ఏదైనా జరగొచ్చు అనే అర్థం వచ్చేలా సుతిమెత్తని విసుర్లు చాలా ఉన్నాయి.
తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు లాంటి చమక్కులు రాశారు. లిరికల్ వీడియో అయినప్పటికీ కొన్ని విజువల్స్ పొందుపరిచారు. రఘుబాబు, సునీల్, సుబ్బరాజు, కబీర్ సింగ్ తదితరులు పవన్ తో పాటు దరువుకి డాన్స్ చేస్తూ కనిపించరు.
ఆస్కార్ విజేత కీరవాణి స్వరపరిచిన మాట వినాలి వినే కొద్దీ ఛార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. హడావిడి లేకుండా కేవలం ఒక చొన్న వాయిద్యంతో క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశారు కీరవాణి. పాటలో సెటప్ చూస్తుంటే ఎక్కడో ఒక కొండ ప్రాంతంలో వీరమల్లు విశ్రాంతి తీసుకుంటుండగా వచ్చే సందర్భంలా ఉంది.
మార్చి 28 విడుదల కాబోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత హైప్ నీ పెంచేందుకు ఇది ఎంతవరకు దోహద పడుతుందో వేచి చూడాలి. ఐతే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ కు తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on January 17, 2025 11:17 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…