పుష్ప-2 విడుదలై 40 రోజులు దాటిపోయింది. రిలీజైన ఇన్ని రోజుల తర్వాత థియేటర్లలో సినిమా ఉండడమే గగనం. కానీ ఇప్పటికీ ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు నామమాత్రమే కానీ.. హిందీలో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లతో సాగిపోతోంది. కొత్త సినిమాలైన గేమ్ చేంజర్, ఫతేలకు దీటుగా ఈ సినిమా వసూళ్లు ఉంటున్నాయి.
ఇప్పటికీ రోజూ రెండు మూడు కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు రాబడుతోంది హిందీ వెర్షన్. శుక్రవారం నుంచి వసూళ్లు ఇంకా పెరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు ఈ శుక్రవారం టికెట్ల ధరను రూ.112కు పరిమితం చేస్తున్నాయి. ఇది అన్ని సినిమాలకూ కలిసి వచ్చే విషయమే. ముఖ్యంగా ‘పుష్న-2’ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
20 నిమిషాల అదనపు నిడివితో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ శుక్రవారమే రిలీజవుతోంది. దీంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పుడుతోంది. చూసిన వాళ్లు, చూడని వాళ్లు థియేటర్లకు వెళ్లబోతున్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే శుక్రవారం ‘పుష్ప-2’ ఎక్కువ వసూళ్లు రాబట్టేలా ఉంది. వీకెండ్లో కూడా దీని ప్రభావం బాగానే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కానీ.. హిందీలో మాత్రం ‘పుష్ప-2’ తగ్గేదే లేదన్నట్లే దూుకెళ్తోంది.
హిందీ వెర్షన్ 8వ వారంలోనరూ కొత్త సినిమాలకు దీటుగా వసూళ్లు రాబడితే అది అద్భుతమే అవుతుంది. కాబట్టి పుష్ప-2 రన్ గురించి చాన్నాళ్ల పాటు మాట్లాడుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. హిందీలో అసలు పబ్లిసిటీ అన్నదే లేకుండా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది. ‘పుష్ప-2’ వసూళ్లు ఇప్పటికే రూ.1800 కోట్ల మార్కును దాటేసి నట్లు మేకర్స్ ప్రకటించారు.
This post was last modified on January 16, 2025 2:39 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…