పుష్ప-2 విడుదలై 40 రోజులు దాటిపోయింది. రిలీజైన ఇన్ని రోజుల తర్వాత థియేటర్లలో సినిమా ఉండడమే గగనం. కానీ ఇప్పటికీ ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు నామమాత్రమే కానీ.. హిందీలో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లతో సాగిపోతోంది. కొత్త సినిమాలైన గేమ్ చేంజర్, ఫతేలకు దీటుగా ఈ సినిమా వసూళ్లు ఉంటున్నాయి.
ఇప్పటికీ రోజూ రెండు మూడు కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు రాబడుతోంది హిందీ వెర్షన్. శుక్రవారం నుంచి వసూళ్లు ఇంకా పెరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు ఈ శుక్రవారం టికెట్ల ధరను రూ.112కు పరిమితం చేస్తున్నాయి. ఇది అన్ని సినిమాలకూ కలిసి వచ్చే విషయమే. ముఖ్యంగా ‘పుష్న-2’ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
20 నిమిషాల అదనపు నిడివితో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ శుక్రవారమే రిలీజవుతోంది. దీంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పుడుతోంది. చూసిన వాళ్లు, చూడని వాళ్లు థియేటర్లకు వెళ్లబోతున్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే శుక్రవారం ‘పుష్ప-2’ ఎక్కువ వసూళ్లు రాబట్టేలా ఉంది. వీకెండ్లో కూడా దీని ప్రభావం బాగానే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కానీ.. హిందీలో మాత్రం ‘పుష్ప-2’ తగ్గేదే లేదన్నట్లే దూుకెళ్తోంది.
హిందీ వెర్షన్ 8వ వారంలోనరూ కొత్త సినిమాలకు దీటుగా వసూళ్లు రాబడితే అది అద్భుతమే అవుతుంది. కాబట్టి పుష్ప-2 రన్ గురించి చాన్నాళ్ల పాటు మాట్లాడుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. హిందీలో అసలు పబ్లిసిటీ అన్నదే లేకుండా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది. ‘పుష్ప-2’ వసూళ్లు ఇప్పటికే రూ.1800 కోట్ల మార్కును దాటేసి నట్లు మేకర్స్ ప్రకటించారు.
This post was last modified on January 16, 2025 2:39 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…