పుష్ప-2 విడుదలై 40 రోజులు దాటిపోయింది. రిలీజైన ఇన్ని రోజుల తర్వాత థియేటర్లలో సినిమా ఉండడమే గగనం. కానీ ఇప్పటికీ ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు నామమాత్రమే కానీ.. హిందీలో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లతో సాగిపోతోంది. కొత్త సినిమాలైన గేమ్ చేంజర్, ఫతేలకు దీటుగా ఈ సినిమా వసూళ్లు ఉంటున్నాయి.
ఇప్పటికీ రోజూ రెండు మూడు కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు రాబడుతోంది హిందీ వెర్షన్. శుక్రవారం నుంచి వసూళ్లు ఇంకా పెరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు ఈ శుక్రవారం టికెట్ల ధరను రూ.112కు పరిమితం చేస్తున్నాయి. ఇది అన్ని సినిమాలకూ కలిసి వచ్చే విషయమే. ముఖ్యంగా ‘పుష్న-2’ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
20 నిమిషాల అదనపు నిడివితో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ శుక్రవారమే రిలీజవుతోంది. దీంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పుడుతోంది. చూసిన వాళ్లు, చూడని వాళ్లు థియేటర్లకు వెళ్లబోతున్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే శుక్రవారం ‘పుష్ప-2’ ఎక్కువ వసూళ్లు రాబట్టేలా ఉంది. వీకెండ్లో కూడా దీని ప్రభావం బాగానే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కానీ.. హిందీలో మాత్రం ‘పుష్ప-2’ తగ్గేదే లేదన్నట్లే దూుకెళ్తోంది.
హిందీ వెర్షన్ 8వ వారంలోనరూ కొత్త సినిమాలకు దీటుగా వసూళ్లు రాబడితే అది అద్భుతమే అవుతుంది. కాబట్టి పుష్ప-2 రన్ గురించి చాన్నాళ్ల పాటు మాట్లాడుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. హిందీలో అసలు పబ్లిసిటీ అన్నదే లేకుండా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది. ‘పుష్ప-2’ వసూళ్లు ఇప్పటికే రూ.1800 కోట్ల మార్కును దాటేసి నట్లు మేకర్స్ ప్రకటించారు.
This post was last modified on January 16, 2025 2:39 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…