తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో ఒకటిగా టాలీవుడ్ ఎదిగింది. భాగ్య నగరంలో ఈ ఇండస్ట్రీ ఈ స్థాయికి చేరుకోవడంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మద్రాసు నగరం మనకూ సొంతమైన సమయంలో అక్కడే మొదలైన తెలుగు సినీ పరిశ్రమ.. ఆ సిటీ తమిళనాడులో భాగం అయ్యాక కూడా అక్కడే కొనసాగుతున్న సమయంలో అక్కినేని వేసిన ముందడుగు.. మొత్తం కథను మార్చేసింది.
ఆయన కోసం నిర్మాతలు హైదరాబాద్ రావడం, ఇక్కడే చిత్రీకరణలు జరపడం.. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం నెమ్మదిగా హైదరాబాద్ వచ్చేయడం.. ఇదంతా ఒక చరిత్ర. హైదరాబాద్లో అడుగు పెట్టి కొండలు గుట్టలతో నిండిన బంజారా హిల్స్లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టి తెలుగు సినీ పరిశ్రమలో ఒక విప్లవానికి తెర తీసిన ఘనత ఏఎన్నార్కే చెందుతుంది.
ఈ విప్లవం మొదలై 50 ఏళ్లు పూర్తి కానుండడం విశేషం. అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న వేళ.. అక్కినేని కుటుంబం ఏడాది పొడవునా సంబరాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నాగ్ ఒక ప్రత్యేకమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోకు ఏఎన్నార్ ఎలా శ్రీకారం చుట్టింది.. దీని నిర్మాణం, ఎదుగుదల కోసం ఆయన ఎంత కష్టపడిందీ ఆయనీ వీడియోలో వివరించారు.
స్టూడియో అంటే తన తల్లిదండ్రులకు ఎంత ఇష్టమో.. ఇందులో ప్రతి ప్రదేశాన్నీ వాళ్లిద్దరూ ఎంతగా ప్రేమించేవారో నాగ్ చెప్పారు. అలాగే అన్నపూర్ణ సిబ్బందిలో ఎవ్వరినీ తాము ఉద్యోగులుగా చూడమని.. వాళ్లంతా ఫ్యామిలీ అని.. ప్రతి సంవత్సరం స్టూడియో మొదలైన సంక్రాంతి రోజు వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం ఏఎన్నార్కు అలవాటని.. తాము కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నాగ్ వెల్లడించారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.
This post was last modified on January 15, 2025 3:32 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…