గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్కు అతి పెద్ద హిట్ ఇదే అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ రూపొందించిన ఈ సైఫై ఫాంటసీ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ‘కల్కి-2’ మీద భారీగా అంచనాలు పెరిగాయి.
ఐతే ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో కొంత అయోమయం నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్.. ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాల్లో సమాంతరంగా నటిస్తున్నాడు. మరోవైపు ‘స్పిరిట్’ మూవీని వీలైనంత త్వరగా మొదలుపెట్టడానికి సందీప్ రెడ్డి వంగ చూస్తున్నాడు. ఇంకోవైపు ‘సలార్-2’ మూవీ టీం కూడా వెయిటింగ్లో ఉంది.
ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ కీలక ప్రకటన చేశారు.‘కల్కి-2’ వచ్చే ఏడాదే విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతే కాక పార్ట్-2లో ముఖ్య పాత్రల తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పారు. ‘కల్కి’లో తక్కువ స్క్రీన్ టైంకు పరిమితమైన కమల్ రెండో భాగంలో సినిమా అంతటా కనిపిస్తారని తెలిపారు. ‘‘కల్కి-2 వచ్చే ఏడాదే విడుదలవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడతాం.
రెండో భాగం అంతా కమల్ హాసనే ఉంటారు. ఆయనకు, ప్రభాస్కు మధ్య రసవత్తరమైన సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా పార్ట్-2లో కీలకంగా ఉంటుంది. ఈ ముగ్గురే సినిమాకు మెయిన్. దీపిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కథ ప్రకారం కొత్త పాత్రలు ఉండే అవకాశం తక్కువే’’ అని అశ్వినీదత్ తెలిపారు.
ఇక దర్శకుడు, తన అల్లుడు నాగ్ అశ్విన్ గురించి దత్ మాట్లాడుతూ.. ‘‘మహానటి సినిమా చేస్తునన సమయంలోనే తన ప్రతిభ ఏంటో అర్థమైంది. అంత పెద్ద సినిమాను ఎలాంటి తడబాటు లేకుండా తీశాడు. అతడికి జీవితంలో ఓటమన్నదే ఉండదని అనుకుంటున్నా. తన ఆలోచన తీరు, సినిమాలు తీసే విధానం అంత గొప్పగా ఉంటాయి’’ అని దత్ అన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…