గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్కు అతి పెద్ద హిట్ ఇదే అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ రూపొందించిన ఈ సైఫై ఫాంటసీ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ‘కల్కి-2’ మీద భారీగా అంచనాలు పెరిగాయి.
ఐతే ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో కొంత అయోమయం నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్.. ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాల్లో సమాంతరంగా నటిస్తున్నాడు. మరోవైపు ‘స్పిరిట్’ మూవీని వీలైనంత త్వరగా మొదలుపెట్టడానికి సందీప్ రెడ్డి వంగ చూస్తున్నాడు. ఇంకోవైపు ‘సలార్-2’ మూవీ టీం కూడా వెయిటింగ్లో ఉంది.
ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ కీలక ప్రకటన చేశారు.‘కల్కి-2’ వచ్చే ఏడాదే విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతే కాక పార్ట్-2లో ముఖ్య పాత్రల తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పారు. ‘కల్కి’లో తక్కువ స్క్రీన్ టైంకు పరిమితమైన కమల్ రెండో భాగంలో సినిమా అంతటా కనిపిస్తారని తెలిపారు. ‘‘కల్కి-2 వచ్చే ఏడాదే విడుదలవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడతాం.
రెండో భాగం అంతా కమల్ హాసనే ఉంటారు. ఆయనకు, ప్రభాస్కు మధ్య రసవత్తరమైన సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా పార్ట్-2లో కీలకంగా ఉంటుంది. ఈ ముగ్గురే సినిమాకు మెయిన్. దీపిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కథ ప్రకారం కొత్త పాత్రలు ఉండే అవకాశం తక్కువే’’ అని అశ్వినీదత్ తెలిపారు.
ఇక దర్శకుడు, తన అల్లుడు నాగ్ అశ్విన్ గురించి దత్ మాట్లాడుతూ.. ‘‘మహానటి సినిమా చేస్తునన సమయంలోనే తన ప్రతిభ ఏంటో అర్థమైంది. అంత పెద్ద సినిమాను ఎలాంటి తడబాటు లేకుండా తీశాడు. అతడికి జీవితంలో ఓటమన్నదే ఉండదని అనుకుంటున్నా. తన ఆలోచన తీరు, సినిమాలు తీసే విధానం అంత గొప్పగా ఉంటాయి’’ అని దత్ అన్నారు.
This post was last modified on January 15, 2025 3:23 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…