ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడమనే సంప్రదాయం 2023లో మైత్రి సంస్థ విజయవంతంగా అమలు చేసింది కానీ ఈసారి దిల్ రాజు అలాంటి రిస్క్ చేస్తారా అనే అనుమానం నెల రోజుల ముందు వరకు ఉండేది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ ప్యాన్ ఇండియా మూవీ.
పైగా మూడేళ్లు నిర్మాణంలో ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో బొమ్మ. శంకర్ టాలీవుడ్ డెబ్యూ. సో సంక్రాంతికి వస్తున్నాంని దానితో సమాంతరంగా రిలీజ్ చేయాలా వద్దానే సందిగ్ధం కొన్నిరోజులు దిల్ రాజు టీమ్ ని వెంటాడిన మాట వాస్తవం. చివరికి టైటిల్ లోనే పట్టుదల చూపించిన అనిల్ రావిపూడి మాటే నెగ్గింది.
కట్ చేస్తే సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ తోనే దుమ్ము దులిపేసింది. ఏదో పర్వాలేదనే టాక్ వచ్చినా చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ తో ఏబీసీ తేడా లేకుండా అన్ని సెంటర్లలో వసూళ్ల జాతర మొదలుపెట్టింది. మూడు రోజుల క్రితం వచ్చిన డాకు మహారాజ్ కు దక్కిన మాస్ మద్దతు ఒక్కసారిగా వెంకటేష్ వైపు షిఫ్ట్ అయిపోయింది.
ఫ్యామిలీస్ తండోపతండాలుగా సంక్రాంతికి వస్తున్నాంకి టికెట్లు తెంపుతున్నారు. తక్కువ స్క్రీన్లు ఉండే కేంద్రాల్లో దీని ఓవర్ ఫ్లోస్ పోటీ సినిమాలను హౌస్ ఫుల్ చేయడం అతిశయోక్తి కాదు. ఇదంతా ఊహించే అనిల్ రావిపూడి ఎలాగైనా పండక్కే రావాలని పంతం పూనాడు.
దీంతో గేమ్ ఛేంజర్ ఫలితం పట్ల దిగాలుగా అనిపించిన దిల్ రాజు టీమ్ లో ఒక్కసారిగా రెట్టింపు జోష్ వచ్చింది. సాయంత్రానికే పటాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. యునానిమస్ రిపోర్ట్స్ చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
షోలకు పెరుగుతున్న డిమాండ్ చూసి ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ దూకుడు ఎన్ని రోజులు ఉంటుందో ఇప్పుడే అంచనాకు రాలేం. పుష్ప 2 నెలకు పైగానే అదరగొట్టింది. దగ్గరలోనే కొత్త రిలీజులు లేకపోవడం సంక్రాంతికి వస్తున్నాంకు ఖచ్చితంగా పెద్ద ప్రయోజనం కలిగించనుంది. ఎంతనేది వేచి చూడాలి.
This post was last modified on January 15, 2025 10:37 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…