Movie News

మహిళా కమిషన్ నోటీసులు : దర్శకుడి క్షమాపణ

దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుక్కారణం. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు ఫిజిక్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

అన్షు ఒకప్పటితో పోలిస్తే సన్నబడిందని చెబుతూ.. ఇలా ఉంటే తెలుగులో కుదరదని, బరువు పెరగాలని పేర్కొంటూ సైజులు పెరగాలి అనే కామెంట్ చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఉదయానికి వ్యవహారం చాలా పెద్దదైపోయింది. త్రినాథరావు బాగా అన్ పాపులర్ అయిపోయారు. వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లిపోయింది.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహిళా కమిషన్.. త్రినాథరావుకు నోటీసులు ఇచ్చింది.వ్యవహారం తీవ్రతను అర్థం చేసుకున్న త్రినాథరావు ఆలస్యం చేయకుండా క్షమాపణలు చెప్పేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్షుతో పాటు నా వ్యాఖ్యల వల్ల బాధ పడ్డ మహిళలు అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టడం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా’’ అని త్రినాథరావు పేర్కొన్నారు.

మరి ఇంతటితో వ్యవహారం సద్దుమణుగుతుందా.. ఇంకేమైనా జరుగుతుందా అన్నది చూడాలి. వరుసగా విజయాలతో ఊపుమీదున్న త్రినాథరావు ఈ వివాదాన్ని కోరి తెచ్చుకున్నారు. ‘మజాకా’ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీలో అన్షు, రీతూ వర్మ, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

This post was last modified on January 13, 2025 6:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

39 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

45 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago