అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా ఈ పేరును మరిచిపోలేరు. అందుక్కారణం.. తొలి చిత్రం ‘మన్మథుడు’తో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. అందులో ఆమెది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. ఓ ముప్పావు గంట కనిపించే పాత్ర అది.
అయినా తన క్యూట్ లుక్స్, యాక్టింగ్తో కుర్రకారును కట్టి పడేసింది. ఆమె మీద తీసిన రెండు పాటలూ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల చెవుల్లో మార్మోగుతుంటాయి. కంళ్లకు ఎంతో ఇంపుగా అనిపిస్తాయి. ఐతే అన్షు రెండో చిత్రం ‘రాఘవేంద్ర’ డిజాస్టర్ కావడంతో ఆమె టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. తమిళంలో ఓ సినిమా చేస్తే అక్కడా సరైన ఫలితం రాకపోవడంతో అన్షు ఇండస్ట్రీకి దూరమైపోయింది.
రెండు దశాబ్దాల పాటు అన్షు ఎక్కడా కనిపించలేదు. ఐతే ఈ మధ్య ‘మన్మథుడు’ రీ రిలీజ్ సందర్భంగా ఆన్ లైన్లో అభిమానులతో ముచ్చటించినపుడు బాగా చిక్కిపోయి గుర్తు పట్టనట్లు కనిపించిన అన్షును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సడెన్గా ఆమె రీఎంట్రీ ఇస్తుండడం పెద్ద షాక్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్షు కీలక పాత్రే చేస్తోంది.
హీరో తండ్రిగా చేస్తున్న రావు రమేష్కు జోడీగా ఆమె నటిస్తుండడం విశేషం. హీరోయిన్గా చేసిన 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ, పైగా తండ్రి పాత్రకు జోడీ అంటే తల్లి పాత్రలకు మారిపోయిందని అనుకుంటాం కానీ.. అన్షుది అలాంటి పాత్ర కాదు. ఆమె దాదాపు హీరోయిన్ తరహా గ్లామర్ పాత్రే చేస్తోంది. తన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్ ఎంటర్టైనింగ్గా ఉండడానికి తోడు.. టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథరావు చేసిన వివాదాస్పద కామెంట్ వల్ల అన్షు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అందరూ తన గురించి చర్చించుకంటున్నారు. ఈ సినిమా, పాత్ర క్లిక్ అయితే అన్షుకు ఇలాంటి రోల్స్ మరిన్ని రావడం.. టాలీవుడ్లో ఆమె బిజీ అవ్వడం ఖాయం.
This post was last modified on January 13, 2025 5:21 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…