అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా ఈ పేరును మరిచిపోలేరు. అందుక్కారణం.. తొలి చిత్రం ‘మన్మథుడు’తో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. అందులో ఆమెది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. ఓ ముప్పావు గంట కనిపించే పాత్ర అది.
అయినా తన క్యూట్ లుక్స్, యాక్టింగ్తో కుర్రకారును కట్టి పడేసింది. ఆమె మీద తీసిన రెండు పాటలూ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల చెవుల్లో మార్మోగుతుంటాయి. కంళ్లకు ఎంతో ఇంపుగా అనిపిస్తాయి. ఐతే అన్షు రెండో చిత్రం ‘రాఘవేంద్ర’ డిజాస్టర్ కావడంతో ఆమె టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. తమిళంలో ఓ సినిమా చేస్తే అక్కడా సరైన ఫలితం రాకపోవడంతో అన్షు ఇండస్ట్రీకి దూరమైపోయింది.
రెండు దశాబ్దాల పాటు అన్షు ఎక్కడా కనిపించలేదు. ఐతే ఈ మధ్య ‘మన్మథుడు’ రీ రిలీజ్ సందర్భంగా ఆన్ లైన్లో అభిమానులతో ముచ్చటించినపుడు బాగా చిక్కిపోయి గుర్తు పట్టనట్లు కనిపించిన అన్షును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సడెన్గా ఆమె రీఎంట్రీ ఇస్తుండడం పెద్ద షాక్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్షు కీలక పాత్రే చేస్తోంది.
హీరో తండ్రిగా చేస్తున్న రావు రమేష్కు జోడీగా ఆమె నటిస్తుండడం విశేషం. హీరోయిన్గా చేసిన 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ, పైగా తండ్రి పాత్రకు జోడీ అంటే తల్లి పాత్రలకు మారిపోయిందని అనుకుంటాం కానీ.. అన్షుది అలాంటి పాత్ర కాదు. ఆమె దాదాపు హీరోయిన్ తరహా గ్లామర్ పాత్రే చేస్తోంది. తన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్ ఎంటర్టైనింగ్గా ఉండడానికి తోడు.. టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథరావు చేసిన వివాదాస్పద కామెంట్ వల్ల అన్షు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అందరూ తన గురించి చర్చించుకంటున్నారు. ఈ సినిమా, పాత్ర క్లిక్ అయితే అన్షుకు ఇలాంటి రోల్స్ మరిన్ని రావడం.. టాలీవుడ్లో ఆమె బిజీ అవ్వడం ఖాయం.
This post was last modified on January 13, 2025 5:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…