నిన్న సందీప్ కిషన్ మజాకా టీజర్ విడుదలయ్యింది. కొన్ని నెలల ముందు సంక్రాంతి రిలీజనుకున్నారు కానీ పోటీ దృష్ట్యా వాయిదా వేసుకుని ఫిబ్రవరి 27కి వెళ్లిపోయారు. రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన సినిమా ఇది. నిజానికిది చిరంజీవితో ప్లాన్ చేసుకున్న చిత్రం.
రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ కథను ముందు మెగాస్టార్ కే వినిపించాడు. పగలబడి నవ్వుతూ విన్న చిరు సానుకూలంగా స్పందించారు కానీ రకరకాల కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే అదే పాత్రని రావు రమేష్ కి అనుగుణంగా పూర్తి వినోదాత్మకంగా మార్చేశారు. అదే మజాకా.
ఇదంతా ప్రెస్ మీట్ లో భాగంగా మజాకా బృందం పంచుకున్న విశేషమే. టీజర్ చూశాక ఎవరికైనా కలిగే అభిప్రాయం ఒకటే. చిరంజీవి ఇది వద్దనుకోవడం ముమ్మాటికీ సరైన నిర్ణయమే. ఎందుకంటే ఆయన ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా కొడుకు ఉండగా మరో మహిళకు లైన్ వేసి పెళ్లి చేసుకోవాలనుకునే అల్లరి పాత్ర సూటవ్వదు.
ఒకవేళ ఒప్పుకుని ఉంటే మార్పులు చేసేవారేమో కానీ మెయిన్ పాయింట్ అయితే మారదుగా. అందుకే కథ రాసుకున్న టైంలో ప్రసన్న కుమార్ ఎవరినైతే దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశాడో తిరిగి అదే రావు రమేష్ దగ్గరికి వెళ్లిపోవడం ఫైనల్ ట్విస్ట్. కంటెంట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వొచ్చు.
అఫీషియల్ గా టీమ్ చెప్పిన ముచ్చట పక్కనపెడితే ఈ స్టోరీనే చిరంజీవి హీరోగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయాలనే దిశగా స్క్రిప్ట్ పనులు జరిగాయని అప్పట్లో టాక్ వచ్చింది. భోళా శంకర్ ఫలితం చూశాక ఆయన మనసు మార్చుకుని విశ్వంభరకు ఓటేశారని చెప్పుకున్నారు.
అటుఇటు తిరిగి ఎంటర్ టైన్మెంట్ ని హ్యాండిల్ చేయగల త్రినాధరావు చేతికి వచ్చింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి మించి రావు రమేష్ కి ఇందులో పెర్ఫార్మన్స్ పరంగా మరో మంచి ఛాన్స్ దొరికింది. ఒకప్పటి నాగార్జున మన్మథుడు హీరోయిన్ అన్షు రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమెనే రావు రమేష్ జోడి.
This post was last modified on January 13, 2025 12:30 pm
వైసీపీలో తొలిసారి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏమవుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయడం…
రాను రాను రీ రిలీజులు చాలా రిస్కీ వ్యవహారాలుగా మారిపోతున్నాయి. ఏది వర్కౌట్ అవుతుందో ఏది పోతుందో ముందే పసిగట్టడంలో…
పైరసీలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి…
మొన్న శుక్రవారం విడుదలైన డెకాయిట్ స్లో అండ్ స్టడీగా ఉంది. టాక్ డీసెంట్ గా ఉండటం, ప్రమోషన్లు జనాలకు చేరడం,…
ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న `హైడ్రా` వ్యవస్థపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే…