నిన్న సందీప్ కిషన్ మజాకా టీజర్ విడుదలయ్యింది. కొన్ని నెలల ముందు సంక్రాంతి రిలీజనుకున్నారు కానీ పోటీ దృష్ట్యా వాయిదా వేసుకుని ఫిబ్రవరి 27కి వెళ్లిపోయారు. రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన సినిమా ఇది. నిజానికిది చిరంజీవితో ప్లాన్ చేసుకున్న చిత్రం.
రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ కథను ముందు మెగాస్టార్ కే వినిపించాడు. పగలబడి నవ్వుతూ విన్న చిరు సానుకూలంగా స్పందించారు కానీ రకరకాల కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే అదే పాత్రని రావు రమేష్ కి అనుగుణంగా పూర్తి వినోదాత్మకంగా మార్చేశారు. అదే మజాకా.
ఇదంతా ప్రెస్ మీట్ లో భాగంగా మజాకా బృందం పంచుకున్న విశేషమే. టీజర్ చూశాక ఎవరికైనా కలిగే అభిప్రాయం ఒకటే. చిరంజీవి ఇది వద్దనుకోవడం ముమ్మాటికీ సరైన నిర్ణయమే. ఎందుకంటే ఆయన ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా కొడుకు ఉండగా మరో మహిళకు లైన్ వేసి పెళ్లి చేసుకోవాలనుకునే అల్లరి పాత్ర సూటవ్వదు.
ఒకవేళ ఒప్పుకుని ఉంటే మార్పులు చేసేవారేమో కానీ మెయిన్ పాయింట్ అయితే మారదుగా. అందుకే కథ రాసుకున్న టైంలో ప్రసన్న కుమార్ ఎవరినైతే దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశాడో తిరిగి అదే రావు రమేష్ దగ్గరికి వెళ్లిపోవడం ఫైనల్ ట్విస్ట్. కంటెంట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వొచ్చు.
అఫీషియల్ గా టీమ్ చెప్పిన ముచ్చట పక్కనపెడితే ఈ స్టోరీనే చిరంజీవి హీరోగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయాలనే దిశగా స్క్రిప్ట్ పనులు జరిగాయని అప్పట్లో టాక్ వచ్చింది. భోళా శంకర్ ఫలితం చూశాక ఆయన మనసు మార్చుకుని విశ్వంభరకు ఓటేశారని చెప్పుకున్నారు.
అటుఇటు తిరిగి ఎంటర్ టైన్మెంట్ ని హ్యాండిల్ చేయగల త్రినాధరావు చేతికి వచ్చింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి మించి రావు రమేష్ కి ఇందులో పెర్ఫార్మన్స్ పరంగా మరో మంచి ఛాన్స్ దొరికింది. ఒకప్పటి నాగార్జున మన్మథుడు హీరోయిన్ అన్షు రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమెనే రావు రమేష్ జోడి.
This post was last modified on January 13, 2025 12:30 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…