బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో బెనిఫిట్, ప్రీమియర్ షోల విషయంలో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. తప్పేంటని ప్రశ్నించింది. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు చేయడం మానేస్తామా? అని పిటిషనర్ను నిలదీసింది. ఇక, ఇదే వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు భిన్నమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రేక్షకులే ముందు! అన్న విధానాన్ని పాటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. “ప్రీమియర్ షోల కు, టికెట్ ధరలను పెంచేందుకు మీ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పిన తర్వాత కూడా బెనిఫిట్ షోలను ఎందుకు వేస్తున్నారు? టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారు? ” అని కోర్టు ప్రశ్నించింది. అంతా మీ ఇష్టమేనా? అని నిలదీసినట్టు తెలిసింది. బెనిఫిట్ షోలను ఆపాలని హైకోర్టు సూచించింది. అంతేకాదు.. ప్రేక్షకుల భద్రతకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని కోరింది.
నిర్మాతల పైనా తెలంగాణ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ బడ్జెట్తో సినిమాలు రూపొందించమని ఎవరు అడిగారు? సగటు ప్రేక్షకుడికి వినోదం అందించేందుకు అంతంత బడ్జెట్ ఎందుకని ప్రశ్నించింది. అంతేకాదు.. ఎక్కవ సొమ్ములు ఖర్చు పెట్టి.. ఆ సొమ్మును సగటు ప్రేక్షకుడి నుంచి రాబట్టుకునే ప్రయత్నాలు మానుకోవాలని సునిశితంగా మందలించింది.
ఈ విషయంపై మరోసారి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్న తెలంగాణ హైకోర్టు.. ఇప్పటికైతే.. భవిష్యత్తులో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చే ముందు ప్రేక్షకుల భద్రతను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ప్రేక్షకులే అందరికన్నా ప్రాధాన్యం ఉన్న వ్యక్తులు అని వ్యాఖ్యానించడం గమనార్హం.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…