ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా నిర్వహించారు కానీ మారిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. అందుకే రెండో తరానికి చెందిన మన సీనియర్ స్టార్లు డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. కానీ సోనూ సూద్ పెద్ద సాహసమే చేస్తున్నాడు. తనే హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి తీసిన ఫతే రేపు రిలీజవుతోంది. చాలా కాలంగా తను కథానాయకుడిగా చేయడం లేదు. అందుకే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనుమానం ట్రేడ్ లో లేకపోలేదు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి.
నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి సోను సూద్ చాలా కష్టపడ్డాడు. అమెరికాలో కొంత భాగం షూట్ చేయాల్సి వస్తే ఆ ఎపిసోడ్ కు అవసరమైన తారాగణంతో పాటు ఒక్కడే అక్కడికి వెళ్లి లొకేషన్లు చూసుకున్నాడు. లోకల్ గా ఒక పన్నెండు మందిని జీతానికి మాట్లాడుకుని చిత్రీకరణ జరిపాడు. శాన్ఫ్రానిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద అనుమతుల కోసం అష్టకష్టాలు పడ్డాడు. దుబాయ్ లో కొంత భాగం తీయాల్సి వస్తే ఇండియా నుంచి కేవలం ఆరుగురితో వెళ్లి పూర్తి చేసుకుని వచ్చాడు. ఒక ఆర్టిస్టు ఉదయం షూట్ ఉంటే మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చినా అవన్నీ భరించి ఫతేని థియేటర్ల దాకా తీసుకురాగలిగాడు.
అరుంధతి విలన్ గా మనకు దగ్గరైన సోను సూద్ కు కరోనా సమయంలో పబ్లిక్ ఇమేజ్ బాగా పెరిగింది. ఆపదలో ఉన్న వాళ్లకు కోట్ల రూపాయల విలువైన సహాయాలు చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. అందుకే ఫతే మీద ఆ సింపతీ వర్కౌట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి పోటీ ఉన్నా సరే బుక్ మై షోలో సగటున గంటకు పదిహేను వందలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఆడియన్స్ లో అంతో ఇంతో దీని మీద ఆసక్తి ఉన్న విషయం అర్థమైపోతుంది. జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన ఫతే కనక హిట్ అయితే సోను సూద్ కు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే.
This post was last modified on January 9, 2025 6:06 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…