Political News

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వైనం యావత్తు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడిన నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గురువారం తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష తర్వాత ఘటనకు బాధ్యులుగా తేలిన ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఓ వైపు చంద్రబాబు తిరుపతిలో ఉండగానే… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఎందుకనో గానీ.., చంద్రబాబు వద్దకు వెళ్లని పవన్… తనకు తానుగా… ప్రత్యేకంగా ఘటనా స్థలిని సందర్శించడంతో పాటుగా… స్థానిక జనసేన ఎమ్మెల్యే, నేతలను వెంటబెట్టుకుని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత స్విమ్స్ ఆసుపత్రి బయటకు వచ్చిన పవన్… అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనూహ్యంగా ఆయన క్షమాపణలు చెప్పారు. తిరుపతి ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని పవన్ అన్నారు. తప్పు జరిగిపోయిందని, తమను క్షమించాలని పవన్ వేడుకున్నారు.

పవన్ నోట పబ్లిక్ గా సారీ అనే పదం వినిపించిందంటే… ఈ ఘటన ఆయనను ఎంత తీవ్రంగా కలచివేసిందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. ఏ అంశంపై అయినా సూటిగా తన మనసులోని భావనను వ్యక్తం చేస్తారని .పేరున్న పవన్…తిరుపతి ఘటనకు తాను బాధ్యత వహిస్తున్నట్లుగా తాను సారీ చెప్పడం నిజంగానే అక్కడి మీడియా ప్రతినిధులను షాక్ కు గురి చేసింది. ఇక ఆ తర్వాత ఘటన జరిగిన తీరును ప్రస్తావించిన పవన్… వెంకన్న దర్శనానికి వచ్చి భక్తులు మరణించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్పిన టీటీడీ ఈవో శ్యామలరావు గానీ, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గానీ ముందుకు రావడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వ్యవహారాలను పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ఇద్దరు అధికారులు విఫలమయ్యారని పవన్ ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీటీడీ పాలకవర్గానికి, అధికార యంత్రాంగానికి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లుగా తనకు తెలిసిందని పవన్ అన్నారు. స్వామి వారి ఆలనాపాలనా చూసుకోవడానిక నియమితులైన రెండు విభాగాల మధ్య ఈ అంతరాలు, పొరపొచ్చాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రమాదంపై ఎవరికి వారు దాటవేత ధోరణి అవలంభించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా స్వామి వారి దర్శనం విషయంలో ముందుగా సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం దక్కేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో దేవుడి దర్శనం కోసం వచ్చే వారు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago