Political News

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వైనం యావత్తు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడిన నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గురువారం తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష తర్వాత ఘటనకు బాధ్యులుగా తేలిన ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఓ వైపు చంద్రబాబు తిరుపతిలో ఉండగానే… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఎందుకనో గానీ.., చంద్రబాబు వద్దకు వెళ్లని పవన్… తనకు తానుగా… ప్రత్యేకంగా ఘటనా స్థలిని సందర్శించడంతో పాటుగా… స్థానిక జనసేన ఎమ్మెల్యే, నేతలను వెంటబెట్టుకుని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత స్విమ్స్ ఆసుపత్రి బయటకు వచ్చిన పవన్… అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనూహ్యంగా ఆయన క్షమాపణలు చెప్పారు. తిరుపతి ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని పవన్ అన్నారు. తప్పు జరిగిపోయిందని, తమను క్షమించాలని పవన్ వేడుకున్నారు.

పవన్ నోట పబ్లిక్ గా సారీ అనే పదం వినిపించిందంటే… ఈ ఘటన ఆయనను ఎంత తీవ్రంగా కలచివేసిందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. ఏ అంశంపై అయినా సూటిగా తన మనసులోని భావనను వ్యక్తం చేస్తారని .పేరున్న పవన్…తిరుపతి ఘటనకు తాను బాధ్యత వహిస్తున్నట్లుగా తాను సారీ చెప్పడం నిజంగానే అక్కడి మీడియా ప్రతినిధులను షాక్ కు గురి చేసింది. ఇక ఆ తర్వాత ఘటన జరిగిన తీరును ప్రస్తావించిన పవన్… వెంకన్న దర్శనానికి వచ్చి భక్తులు మరణించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్పిన టీటీడీ ఈవో శ్యామలరావు గానీ, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గానీ ముందుకు రావడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వ్యవహారాలను పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ఇద్దరు అధికారులు విఫలమయ్యారని పవన్ ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీటీడీ పాలకవర్గానికి, అధికార యంత్రాంగానికి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లుగా తనకు తెలిసిందని పవన్ అన్నారు. స్వామి వారి ఆలనాపాలనా చూసుకోవడానిక నియమితులైన రెండు విభాగాల మధ్య ఈ అంతరాలు, పొరపొచ్చాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రమాదంపై ఎవరికి వారు దాటవేత ధోరణి అవలంభించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా స్వామి వారి దర్శనం విషయంలో ముందుగా సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం దక్కేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో దేవుడి దర్శనం కోసం వచ్చే వారు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు.

This post was last modified on January 9, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago