తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఐకానిక్ సెలబ్రేషన్స్ అంటే ముందు గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్. సుదర్శన్, దేవి, సంధ్య, సప్తగిరి తదితర థియేటర్లలో అర్ధరాత్రి బెనిఫిట్ షోల టైంలో జరిగే కోలాహలం మాములుగా ఉండదు. డీజే సౌండ్లు, ఊరేగింపులు, బాణాసంచా, పెరేడ్లు అబ్బో హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవలే జరిగిన పుష్ప 2 దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం నిబంధనలు కఠినతనం చేయడంతో చాలా ఆంక్షల మధ్య ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు. దానికి తోడు మిడ్ నైట్ ప్రీమియర్లకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వకపోవడం మరో షాక్.
మూడు సినిమాల మీద దీని ప్రభావం ఉంటుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం కోసం రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఫ్యాన్స్ పోటాపోటీగా సంబరాలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీటిని పరిమితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈసారి ఏ చిన్న పొరపాటుకి తావిచ్చే ఉద్దేశంలో పోలీసులు లేరు. మరీ మౌనంగా చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ థియేటర్ బయట మాత్రం ఎక్కువ హల్చల్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేయాలని చూసినా వెంటనే దానికి అనుగుణంగా చర్యలు ఉండే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కానీ ఏపీలో ఎలాంటి సమస్య లేదు. రాత్రి ఒంటి గంటకు అన్ని కేంద్రాల్లో ప్రీమియర్లు పడుతున్నాయి. మరో బాధ ఏంటంటే క్రాస్ రోడ్స్ లో మొదటి షో పడేలోపే ఆంధ్రప్రదేశ్ నుంచి టాక్ బయటికి వచ్చేస్తుంది. రివ్యూలు, ట్వీట్లు హోరెత్తిపోతాయి. కొందరు అత్యుత్సాహంతో పెట్టే థియేటర్ వీడియోలు మరింత కలవరానికి గురి చేస్తాయి. అంటే ఫస్ట్ షో అనుభూతి దక్కించుకునే లోపే మొత్తం రిపోర్ట్ బయటికి వచ్చేస్తుందన్న మాట. ఇదంతా తాత్కాలికమే కావొచ్చు. సెలబ్రేషన్స్ పరిమితంగానే జరగొచ్చు. భవిష్యత్తులో మార్పు వస్తుందనే గట్టి నమ్మకం సినీ ప్రియుల్లో ఉంది. అది జరగాలనే అందరి కోరిక.
This post was last modified on January 9, 2025 3:56 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…