తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఐకానిక్ సెలబ్రేషన్స్ అంటే ముందు గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్. సుదర్శన్, దేవి, సంధ్య, సప్తగిరి తదితర థియేటర్లలో అర్ధరాత్రి బెనిఫిట్ షోల టైంలో జరిగే కోలాహలం మాములుగా ఉండదు. డీజే సౌండ్లు, ఊరేగింపులు, బాణాసంచా, పెరేడ్లు అబ్బో హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవలే జరిగిన పుష్ప 2 దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం నిబంధనలు కఠినతనం చేయడంతో చాలా ఆంక్షల మధ్య ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు. దానికి తోడు మిడ్ నైట్ ప్రీమియర్లకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వకపోవడం మరో షాక్.
మూడు సినిమాల మీద దీని ప్రభావం ఉంటుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం కోసం రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఫ్యాన్స్ పోటాపోటీగా సంబరాలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీటిని పరిమితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈసారి ఏ చిన్న పొరపాటుకి తావిచ్చే ఉద్దేశంలో పోలీసులు లేరు. మరీ మౌనంగా చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ థియేటర్ బయట మాత్రం ఎక్కువ హల్చల్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేయాలని చూసినా వెంటనే దానికి అనుగుణంగా చర్యలు ఉండే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కానీ ఏపీలో ఎలాంటి సమస్య లేదు. రాత్రి ఒంటి గంటకు అన్ని కేంద్రాల్లో ప్రీమియర్లు పడుతున్నాయి. మరో బాధ ఏంటంటే క్రాస్ రోడ్స్ లో మొదటి షో పడేలోపే ఆంధ్రప్రదేశ్ నుంచి టాక్ బయటికి వచ్చేస్తుంది. రివ్యూలు, ట్వీట్లు హోరెత్తిపోతాయి. కొందరు అత్యుత్సాహంతో పెట్టే థియేటర్ వీడియోలు మరింత కలవరానికి గురి చేస్తాయి. అంటే ఫస్ట్ షో అనుభూతి దక్కించుకునే లోపే మొత్తం రిపోర్ట్ బయటికి వచ్చేస్తుందన్న మాట. ఇదంతా తాత్కాలికమే కావొచ్చు. సెలబ్రేషన్స్ పరిమితంగానే జరగొచ్చు. భవిష్యత్తులో మార్పు వస్తుందనే గట్టి నమ్మకం సినీ ప్రియుల్లో ఉంది. అది జరగాలనే అందరి కోరిక.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…