తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఐకానిక్ సెలబ్రేషన్స్ అంటే ముందు గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్. సుదర్శన్, దేవి, సంధ్య, సప్తగిరి తదితర థియేటర్లలో అర్ధరాత్రి బెనిఫిట్ షోల టైంలో జరిగే కోలాహలం మాములుగా ఉండదు. డీజే సౌండ్లు, ఊరేగింపులు, బాణాసంచా, పెరేడ్లు అబ్బో హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవలే జరిగిన పుష్ప 2 దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం నిబంధనలు కఠినతనం చేయడంతో చాలా ఆంక్షల మధ్య ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు. దానికి తోడు మిడ్ నైట్ ప్రీమియర్లకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వకపోవడం మరో షాక్.
మూడు సినిమాల మీద దీని ప్రభావం ఉంటుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం కోసం రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఫ్యాన్స్ పోటాపోటీగా సంబరాలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీటిని పరిమితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈసారి ఏ చిన్న పొరపాటుకి తావిచ్చే ఉద్దేశంలో పోలీసులు లేరు. మరీ మౌనంగా చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ థియేటర్ బయట మాత్రం ఎక్కువ హల్చల్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేయాలని చూసినా వెంటనే దానికి అనుగుణంగా చర్యలు ఉండే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కానీ ఏపీలో ఎలాంటి సమస్య లేదు. రాత్రి ఒంటి గంటకు అన్ని కేంద్రాల్లో ప్రీమియర్లు పడుతున్నాయి. మరో బాధ ఏంటంటే క్రాస్ రోడ్స్ లో మొదటి షో పడేలోపే ఆంధ్రప్రదేశ్ నుంచి టాక్ బయటికి వచ్చేస్తుంది. రివ్యూలు, ట్వీట్లు హోరెత్తిపోతాయి. కొందరు అత్యుత్సాహంతో పెట్టే థియేటర్ వీడియోలు మరింత కలవరానికి గురి చేస్తాయి. అంటే ఫస్ట్ షో అనుభూతి దక్కించుకునే లోపే మొత్తం రిపోర్ట్ బయటికి వచ్చేస్తుందన్న మాట. ఇదంతా తాత్కాలికమే కావొచ్చు. సెలబ్రేషన్స్ పరిమితంగానే జరగొచ్చు. భవిష్యత్తులో మార్పు వస్తుందనే గట్టి నమ్మకం సినీ ప్రియుల్లో ఉంది. అది జరగాలనే అందరి కోరిక.
This post was last modified on January 9, 2025 3:56 pm
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…