నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు వెంకన్న భక్తులు కన్నుమూశారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఫలితంగా తిరుపతిలో బాధితుల తరఫు బంధువుల ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి. యావత్తు భక్త లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి విషాద సమయంలో వేడుకలు ఎలా నిర్వహిస్తారు? అందుకే కాబోలు… ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అనంతపురం వేదికగా జరగాల్సి ఉన్న డాకు మహరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఇటు రాజకీయాల్లో ఓ రేంజిలో రాణిస్తున్న బాలయ్య…సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో గురువారం నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య జరగనున్న ఈ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ టికెట్ల జారీ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసినా… లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దీంతో ఏపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా బాలయ్య సినిమా వేడుకను రద్దు చేస్తూ ఆ సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది.
This post was last modified on January 9, 2025 10:27 am
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…