Movie News

శోకంలో సంబరాలెలా?… ‘డాకు’ ఈవెంట్ రద్దు

నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు వెంకన్న భక్తులు కన్నుమూశారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఫలితంగా తిరుపతిలో బాధితుల తరఫు బంధువుల ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి. యావత్తు భక్త లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి విషాద సమయంలో వేడుకలు ఎలా నిర్వహిస్తారు? అందుకే కాబోలు… ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అనంతపురం వేదికగా జరగాల్సి ఉన్న డాకు మహరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

ఇటు రాజకీయాల్లో ఓ రేంజిలో రాణిస్తున్న బాలయ్య…సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో గురువారం నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య జరగనున్న ఈ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.

అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ టికెట్ల జారీ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసినా… లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దీంతో ఏపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా బాలయ్య సినిమా వేడుకను రద్దు చేస్తూ ఆ సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది.

This post was last modified on January 9, 2025 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 minutes ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

1 hour ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

1 hour ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago