నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు వెంకన్న భక్తులు కన్నుమూశారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఫలితంగా తిరుపతిలో బాధితుల తరఫు బంధువుల ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి. యావత్తు భక్త లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి విషాద సమయంలో వేడుకలు ఎలా నిర్వహిస్తారు? అందుకే కాబోలు… ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అనంతపురం వేదికగా జరగాల్సి ఉన్న డాకు మహరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఇటు రాజకీయాల్లో ఓ రేంజిలో రాణిస్తున్న బాలయ్య…సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో గురువారం నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య జరగనున్న ఈ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ టికెట్ల జారీ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసినా… లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దీంతో ఏపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా బాలయ్య సినిమా వేడుకను రద్దు చేస్తూ ఆ సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…