పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే. కొన్నిసార్లు వాయిదాలు పడటం, ఓపెనింగ్స్ ని పరస్పరం దెబ్బ తీసుకోవడం అన్ని భాషల్లో చూసిన అనుభవమే. సరైన ప్లానింగ్, నిర్మాతల మధ్య అండర్ స్టాండింగ్ లేకపోతే వచ్చే సమస్య ఇది. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వార్ 2ని ఆగస్ట్ 14 విడుదలకు అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే దర్శకుడు అయాన్ ముఖర్జీ షూటింగ్ పూర్తి చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగిన సమయం పెట్టుకున్నాడు.
తీరా చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి కూడా అదే డేట్ మీద కన్నేసిందని చెన్నై అప్డేట్. ముందు వేసవిలో రావాలనుకున్నారు కానీ అప్పటికంతా పనులు పూర్తయ్యేలా లేకపోవడంతో బ్లాక్ బస్టర్ జైలర్ కు అచ్చివచ్చిన ఆగస్ట్ సెంటిమెంట్ ని ఫాలో కావాలని నిర్ణయించుకున్నారట. కూలిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్ లాంటి పేర్లు ఎక్కడ లేని క్రేజ్ పెంచుతున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే బజ్ విపరీతంగా పెంచుకున్న రేంజ్ దీనిది. సో కూలి చూపించే ప్రభావం అంత ఈజీగా తీసుకోలేం.
ఒకవేళ ఇది నిజమైతే వార్ 2కి సౌత్ లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల కథనం. ఇంకో ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ ఇలాంటివి ఇప్పటి నుంచే టెన్షన్ కలిగిస్తాయి. వార్ 2 మీద యష్ రాజ్ ఫిలిమ్స్ వందల కోట్లు కుమ్మరించింది. సోలో రిలీజ్ కోసమే ముందస్తుగా తేదీని లాక్ చేసుకుంది. అందుకే హిందీలో వేరెవరు క్లాష్ కు వెళ్లట్లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కూలి కనక ఆగస్ట్ 14 కావాలంటే మాత్రం పోటీ మహా రసవత్తరంగా మారుతుంది. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on January 8, 2025 2:00 pm
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…