పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే. కొన్నిసార్లు వాయిదాలు పడటం, ఓపెనింగ్స్ ని పరస్పరం దెబ్బ తీసుకోవడం అన్ని భాషల్లో చూసిన అనుభవమే. సరైన ప్లానింగ్, నిర్మాతల మధ్య అండర్ స్టాండింగ్ లేకపోతే వచ్చే సమస్య ఇది. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వార్ 2ని ఆగస్ట్ 14 విడుదలకు అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే దర్శకుడు అయాన్ ముఖర్జీ షూటింగ్ పూర్తి చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగిన సమయం పెట్టుకున్నాడు.
తీరా చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి కూడా అదే డేట్ మీద కన్నేసిందని చెన్నై అప్డేట్. ముందు వేసవిలో రావాలనుకున్నారు కానీ అప్పటికంతా పనులు పూర్తయ్యేలా లేకపోవడంతో బ్లాక్ బస్టర్ జైలర్ కు అచ్చివచ్చిన ఆగస్ట్ సెంటిమెంట్ ని ఫాలో కావాలని నిర్ణయించుకున్నారట. కూలిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్ లాంటి పేర్లు ఎక్కడ లేని క్రేజ్ పెంచుతున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే బజ్ విపరీతంగా పెంచుకున్న రేంజ్ దీనిది. సో కూలి చూపించే ప్రభావం అంత ఈజీగా తీసుకోలేం.
ఒకవేళ ఇది నిజమైతే వార్ 2కి సౌత్ లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల కథనం. ఇంకో ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ ఇలాంటివి ఇప్పటి నుంచే టెన్షన్ కలిగిస్తాయి. వార్ 2 మీద యష్ రాజ్ ఫిలిమ్స్ వందల కోట్లు కుమ్మరించింది. సోలో రిలీజ్ కోసమే ముందస్తుగా తేదీని లాక్ చేసుకుంది. అందుకే హిందీలో వేరెవరు క్లాష్ కు వెళ్లట్లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కూలి కనక ఆగస్ట్ 14 కావాలంటే మాత్రం పోటీ మహా రసవత్తరంగా మారుతుంది. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on January 8, 2025 2:00 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…