దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల సినిమాల్లో కొంచెం అటుఇటుగా ఉన్న ఎపిసోడ్స్ ని సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేయడం ఎన్నోసార్లు చూశాం. జైలర్, దేవర, విక్రమ్, లియో లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. డేట్స్ లేవని తెలిసినా, ఆలస్యమవుతుందని చెప్పినా సరే దర్శక నిర్మాతలు ఎదురు చూసేందుకు వెనుకాడటం లేదు. ప్రస్తుతం తను తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాలు విజయ్ దేవరకొండ 12, మేజిక్ కి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదంతా బాగానే ఉంది అనిరుధ్ మ్యూజిక్ మీద ఒక కామెంట్ ఉంది. ఇప్పుడేదో ఊపేసినా, థియేటర్లలో డాల్బీ సౌండుతో అదరగొట్టినా తన పాటల్లో అధిక శాతం వాటికి లాంగ్ లైఫ్ లేదనేది ప్రధానంగా విన్పించే విమర్శ. ఏఆర్ రెహ్మాన్ ఈ విషయంలోనే ఒక సలహా ఇచ్చాడు. నిన్న చెన్నైలో జయం రవి – నిత్య మీనన్ నటించిన కాదలిక్క నేరమిల్లై ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా గెస్టుగా వచ్చిన అనిరుద్ ని ఉద్దేశించి మాట్లాడుతూ క్లాసికల్ టచ్, రాగాలను ఆధారంగా చేసే ప్రయోగాలు ఎక్కువ కాలం నిలుస్తాయని అలాంటివి కంపోజ్ చేయమని సలహా ఇచ్చాడు. ముందు అనిరుధ్ పనితనాన్ని పొగిడాకే తన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
ఎలా చూసినా రెహమాన్ చెప్పిన సలహా ముమ్మాటికీ ఆచరణీయం. ఎందుకంటే ఒకప్పటిలా ఇప్పటి ఆడియోలు లాంగ్ లైఫ్ దక్కించుకోవడం లేదు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు, గీతాంజలి, రోజా, బొంబాయి లాంటి పాటలను ఇప్పుడు కూడా పదే పదే వింటున్నాం కానీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అనిరుధ్ సాంగ్స్ కి ఇంత రీచ్ ఉంటుందా అంటే సమాధానం చెప్పడం కష్టం. సో లెజెండరీ సలహాని పాటిస్తే గొప్ప ఫలితం అందుకోవచ్చు. కాదలిక్క నేరమిల్లైకు రెహమానే సంగీతం సమకూర్చారు. విడాముయార్చి తప్పుకోవడంతో దీన్ని పొంగల్ బరిలో దింపుతున్నారు నిర్మాతలు.
This post was last modified on January 8, 2025 12:58 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…