దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల సినిమాల్లో కొంచెం అటుఇటుగా ఉన్న ఎపిసోడ్స్ ని సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేయడం ఎన్నోసార్లు చూశాం. జైలర్, దేవర, విక్రమ్, లియో లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. డేట్స్ లేవని తెలిసినా, ఆలస్యమవుతుందని చెప్పినా సరే దర్శక నిర్మాతలు ఎదురు చూసేందుకు వెనుకాడటం లేదు. ప్రస్తుతం తను తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాలు విజయ్ దేవరకొండ 12, మేజిక్ కి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదంతా బాగానే ఉంది అనిరుధ్ మ్యూజిక్ మీద ఒక కామెంట్ ఉంది. ఇప్పుడేదో ఊపేసినా, థియేటర్లలో డాల్బీ సౌండుతో అదరగొట్టినా తన పాటల్లో అధిక శాతం వాటికి లాంగ్ లైఫ్ లేదనేది ప్రధానంగా విన్పించే విమర్శ. ఏఆర్ రెహ్మాన్ ఈ విషయంలోనే ఒక సలహా ఇచ్చాడు. నిన్న చెన్నైలో జయం రవి – నిత్య మీనన్ నటించిన కాదలిక్క నేరమిల్లై ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా గెస్టుగా వచ్చిన అనిరుద్ ని ఉద్దేశించి మాట్లాడుతూ క్లాసికల్ టచ్, రాగాలను ఆధారంగా చేసే ప్రయోగాలు ఎక్కువ కాలం నిలుస్తాయని అలాంటివి కంపోజ్ చేయమని సలహా ఇచ్చాడు. ముందు అనిరుధ్ పనితనాన్ని పొగిడాకే తన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
ఎలా చూసినా రెహమాన్ చెప్పిన సలహా ముమ్మాటికీ ఆచరణీయం. ఎందుకంటే ఒకప్పటిలా ఇప్పటి ఆడియోలు లాంగ్ లైఫ్ దక్కించుకోవడం లేదు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు, గీతాంజలి, రోజా, బొంబాయి లాంటి పాటలను ఇప్పుడు కూడా పదే పదే వింటున్నాం కానీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అనిరుధ్ సాంగ్స్ కి ఇంత రీచ్ ఉంటుందా అంటే సమాధానం చెప్పడం కష్టం. సో లెజెండరీ సలహాని పాటిస్తే గొప్ప ఫలితం అందుకోవచ్చు. కాదలిక్క నేరమిల్లైకు రెహమానే సంగీతం సమకూర్చారు. విడాముయార్చి తప్పుకోవడంతో దీన్ని పొంగల్ బరిలో దింపుతున్నారు నిర్మాతలు.
This post was last modified on January 8, 2025 12:58 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…