కొత్త టెక్నాలజీగా మొదలై విప్లవంగా మారుతున్న ఏఐ సాంకేతికత భవిష్యత్తులో ఎన్ని పుంతలు తొక్కుతుందో కానీ ప్రాధమిక దశలో ఇది చేస్తున్న అద్భుతాలు చూసి ఒక పక్క ఆనందం, మరోపక్క ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిన్నటికి నిన్న స్క్విడ్ గేమ్ లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఒక ఔత్సాహికుడు చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. నిజ జీవితంలో చూసే అవకాశమే లేని కాంబోలు దాంట్లో రియల్ గా అనిపించాయి. ఇది వీటికే పరిమితం కావడం లేదు. సంగీతంలోనూ అడుగు పెట్టింది. ఇటీవలే తమన్ AI గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన వివరించాడు.
గేమ్ ఛేంజర్ లో తొలుత అనధికారంగా లీకై విమర్శకులకు గురైన మొదటి పాట జరగండి జరగండి. ఆడియో క్వాలిటీ సరిగా లేకవడం వల్ల దాని మీద నెగటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి. అయితే మొదటగా దీన్ని హైదరాబాద్ కు చెందిన హనుమాన్ అనే గాయకుడితో పాడించారు. బాద్షాలో బంతిపూల జానకి సాంగ్ ని రిఫరెన్స్ గా తీసుకుని జరగండి జరగండి పాటకు దలేర్ మెహేంది పాడినట్టుగా ఏఐ టెక్నాలజీ వాడి రీ క్రియేట్ చేశారు. దీంతో ఆయనే నిజంగా పాడారనే అనుభూతి కలిగింది. అఫ్కోర్స్ ఇవన్నీ అనుమతులు గట్రా తీసుకునే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంతకు ముందు ఏఆర్ రెహమాన్ ఈ ప్రయోగం చేశారు.
ఏది ఎలా ఉన్నా గేమ్ ఛేంజర్ మెయిన్ హైలైట్స్ లో జరగండి పాట ప్రధానంగా ఉంటుందని ఎస్జె సూర్యతో సహా టీమ్ లో పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. తమన్ కూడా దీని గురించి మాములు ఎలివేషన్ ఇవ్వడం లేదు. ఖరీదయిన సెట్లలో ప్రభుదేవా కొరియోగ్రఫీకి రామ్ చరణ్, కియారా అద్వానీలు కలిసి చేసిన డాన్స్ థియేటర్లను ఊపేస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ఇందులో ఏ మేరకు నిజముందో తెలిసిపోతుంది. సంక్రాంతికి మొదటగా వస్తున్న సినిమాగా గేమ్ ఛేంజర్ మీద ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ వర్గాలు ఫలితం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
This post was last modified on January 8, 2025 11:13 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…