కొత్త టెక్నాలజీగా మొదలై విప్లవంగా మారుతున్న ఏఐ సాంకేతికత భవిష్యత్తులో ఎన్ని పుంతలు తొక్కుతుందో కానీ ప్రాధమిక దశలో ఇది చేస్తున్న అద్భుతాలు చూసి ఒక పక్క ఆనందం, మరోపక్క ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిన్నటికి నిన్న స్క్విడ్ గేమ్ లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఒక ఔత్సాహికుడు చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. నిజ జీవితంలో చూసే అవకాశమే లేని కాంబోలు దాంట్లో రియల్ గా అనిపించాయి. ఇది వీటికే పరిమితం కావడం లేదు. సంగీతంలోనూ అడుగు పెట్టింది. ఇటీవలే తమన్ AI గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన వివరించాడు.
గేమ్ ఛేంజర్ లో తొలుత అనధికారంగా లీకై విమర్శకులకు గురైన మొదటి పాట జరగండి జరగండి. ఆడియో క్వాలిటీ సరిగా లేకవడం వల్ల దాని మీద నెగటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి. అయితే మొదటగా దీన్ని హైదరాబాద్ కు చెందిన హనుమాన్ అనే గాయకుడితో పాడించారు. బాద్షాలో బంతిపూల జానకి సాంగ్ ని రిఫరెన్స్ గా తీసుకుని జరగండి జరగండి పాటకు దలేర్ మెహేంది పాడినట్టుగా ఏఐ టెక్నాలజీ వాడి రీ క్రియేట్ చేశారు. దీంతో ఆయనే నిజంగా పాడారనే అనుభూతి కలిగింది. అఫ్కోర్స్ ఇవన్నీ అనుమతులు గట్రా తీసుకునే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంతకు ముందు ఏఆర్ రెహమాన్ ఈ ప్రయోగం చేశారు.
ఏది ఎలా ఉన్నా గేమ్ ఛేంజర్ మెయిన్ హైలైట్స్ లో జరగండి పాట ప్రధానంగా ఉంటుందని ఎస్జె సూర్యతో సహా టీమ్ లో పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. తమన్ కూడా దీని గురించి మాములు ఎలివేషన్ ఇవ్వడం లేదు. ఖరీదయిన సెట్లలో ప్రభుదేవా కొరియోగ్రఫీకి రామ్ చరణ్, కియారా అద్వానీలు కలిసి చేసిన డాన్స్ థియేటర్లను ఊపేస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ఇందులో ఏ మేరకు నిజముందో తెలిసిపోతుంది. సంక్రాంతికి మొదటగా వస్తున్న సినిమాగా గేమ్ ఛేంజర్ మీద ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ వర్గాలు ఫలితం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
This post was last modified on January 8, 2025 11:13 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…