హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చారిత్రక చిత్రాన్ని రూపొందించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. దాని తర్వాత తీయాలనుకున్న సినిమా ఇదే. రానా దగ్గుబాటిని హిరణ్యకశ్యపుడిగా పెట్టి రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలని తలపోశాడు గుణ. ఇందుకోసం కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేశాడు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి.
ప్రి విజువలైజేషన్ వర్క్ సైతం జరిగింది. కానీ కరోనా వల్లో మరో కారణంతోనో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈలోపు ‘శాకుంతలం’ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు గుణ. మహాభారతంలోని ఒక పర్వమైన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. దుష్యుంతుడు-శకుంతలల ప్రేమకథకు గుణ వెండితెర రూపం ఇవ్వనున్నాడు.
ఐతే కొన్నేళ్ల నుంచి ‘హిరణ్యకశ్యప’ గురించి చెబుతూ.. ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమాను ప్రకటించడంతో ముందు అనుకున్న భారీ ప్రాజెక్టు అటకెక్కేసినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమాను నిర్మించాల్సిన సురేష్ బాబు, ఇందులో లీడ్ రోల్ చేయాల్సిన రానా నుంచి దాని గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడం ఈ సందేహాలను పెంచుతోంది.
కానీ గుణశేఖర్ మాత్రం ఆ ప్రచారాన్ని గట్టిగా ఖండించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’ తనకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, దాని మీద కొన్నేళ్ల పాటు పని చేశానని.. దానికి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తయ్యాయని చెప్పాడు. ఈ సినిమాకు లొకేషన్లు, సెట్స్ కూడా ఓకే అయినట్లు తెలిపాడు.
ఐతే ఆ చిత్రం భారీ కాస్ట్ అండ్ క్రూతో చేయాల్సిందని, వందల మందితో చిత్రీకరణ జరపాలని.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే తక్కువమందితో, పరిమిత లొకేషన్లలో తీయడానికి అవకాశమున్న ‘శాకుంతలం’ను ముందు పూర్తి చేయడానికి నడుం బిగించానని చెప్పాడు గుణశేఖర్.
This post was last modified on October 14, 2020 12:20 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…