హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చారిత్రక చిత్రాన్ని రూపొందించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. దాని తర్వాత తీయాలనుకున్న సినిమా ఇదే. రానా దగ్గుబాటిని హిరణ్యకశ్యపుడిగా పెట్టి రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలని తలపోశాడు గుణ. ఇందుకోసం కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేశాడు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి.
ప్రి విజువలైజేషన్ వర్క్ సైతం జరిగింది. కానీ కరోనా వల్లో మరో కారణంతోనో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈలోపు ‘శాకుంతలం’ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు గుణ. మహాభారతంలోని ఒక పర్వమైన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. దుష్యుంతుడు-శకుంతలల ప్రేమకథకు గుణ వెండితెర రూపం ఇవ్వనున్నాడు.
ఐతే కొన్నేళ్ల నుంచి ‘హిరణ్యకశ్యప’ గురించి చెబుతూ.. ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమాను ప్రకటించడంతో ముందు అనుకున్న భారీ ప్రాజెక్టు అటకెక్కేసినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమాను నిర్మించాల్సిన సురేష్ బాబు, ఇందులో లీడ్ రోల్ చేయాల్సిన రానా నుంచి దాని గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడం ఈ సందేహాలను పెంచుతోంది.
కానీ గుణశేఖర్ మాత్రం ఆ ప్రచారాన్ని గట్టిగా ఖండించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’ తనకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, దాని మీద కొన్నేళ్ల పాటు పని చేశానని.. దానికి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తయ్యాయని చెప్పాడు. ఈ సినిమాకు లొకేషన్లు, సెట్స్ కూడా ఓకే అయినట్లు తెలిపాడు.
ఐతే ఆ చిత్రం భారీ కాస్ట్ అండ్ క్రూతో చేయాల్సిందని, వందల మందితో చిత్రీకరణ జరపాలని.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే తక్కువమందితో, పరిమిత లొకేషన్లలో తీయడానికి అవకాశమున్న ‘శాకుంతలం’ను ముందు పూర్తి చేయడానికి నడుం బిగించానని చెప్పాడు గుణశేఖర్.
This post was last modified on October 14, 2020 12:20 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…