బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ ట్రైలర్ చూశాక అందరికీ వచ్చిన సందేహం ఒకటే. ఇంత గ్రాండ్ విజువల్స్, స్టయిలిష్ యాక్షన్ పెట్టుకుని కేవలం తెలుగుకే ఎందుకు పరిమితం చేస్తున్నారని. అది నిర్మాణ సంస్థ సితారకు వినిపించింది కాబోలు తమిళ, హిందీలోనూ సమాంతరంగా జనవరి 12నే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. అంటే ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా అన్నమాట.
ఇవాళో రేపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఒకరకంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే డాకు మహారాజ్ క్యాస్టింగ్ అలా ఉంది. యానిమల్ నుంచి ఫేమ్ తెచ్చుకున్న బాబీ డియోల్ మరోసారి పవర్ ఫుల్ విలన్ రోల్ నీ దక్కించుకుంది ఇందులోనే. రవి కిషన్, షైన్ టామ్ చాకో లాంటి ఆర్టిస్టులు మరో ప్లస్.
తమన్ సంగీతానికి ఆల్రెడీ అన్ని భాషల్లో గుర్తింపు ఉంది కాబట్టి మార్కెటింగ్ పరంగా ఆ అంశం ఉపయోగపడుతుంది. గతంలో అఖండ, భగవంత్ కేసరిలకు సైతం ఒకే సమయంలో బాలీవుడ్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సాధ్యపడలేదు. డాకు మహారాజ్ తో మొదలుపెడితే అఖండ 2తో కొనసాగించవచ్చు.
బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్, బిజినెస్ తో డాకు మహారాజ్ వస్తోంది. బందిపోట్ల అంతం చూసే నాయకుడిగా, ఆపదలో ఉన్న జనాలకు రక్షకుడిగా ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి ఇలా ప్రాధాన్యమున్న మహిళా పాత్రలు చాలానే ఉన్నాయి.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాంతో పాటు హిందీ, తమిళంలో ఇతర సినిమాల నుంచి చెప్పుకోదగ్గ పోటీ ఉన్నప్పటికీ డాకు మహారాజ్ కంటెంట్ పట్ల మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. బాలకృష్ణని ఎప్పుడూ చూడనంత శక్తివంతంగా చూపించమని నిర్మాత నాగవంశీ చెప్పిన మాటలు అంచనాలు అమాంతం పెంచేశాయి.
This post was last modified on January 7, 2025 1:41 pm
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…