రాంగోపాల్వర్మకి అపార జ్ఞానం వుంది. అనేక సినిమాలు చూసాడు… అంతకు పదింతల పుస్తకాలు చదివాడు. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలడు. ప్రతి అంశంపై తనదైన శైలిలో వివరణలు ఇవ్వగలడు. అయితే వర్మకు కాంట్రవర్సీ పిచ్చి. పబ్లిసిటీ యావ. అదే అతడిని రాంగ్ ట్రాక్ ఎక్కించి పబ్లిక్ దృష్టిలో పలుచన చేసింది. దానికి తోడు తాను తీసే సినిమాలు కూడా పోను పోనూ క్వాలిటీ కోల్పోయి అతడిని కింది గ్రేడ్ ఫిలింమేకర్స్ లిస్టులోకి తోసింది.
అదే తన శిష్యుడు పూరి జగన్నాథ్ జ్ఞాన సంపదను ఎలా వాడుకోవాలో చూపిస్తున్నాడు. ఫిలింమేకర్గా వర్మ రేంజ్ క్లాసిక్స్ పూరీ తీయలేదు. కమర్షియల్ డైరెక్టర్గా మాస్ జనాల మనసు దోచుకున్నాడు. అలాగే నాలెడ్జ్ పరంగాను వర్మతో పూరి సాటిరాలేడు. కానీ తనకున్న జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలనేది పూరికి బాగా తెలుసు. అందుకే పాడ్ కాస్ట్లు ఇంకా ఇండియాలో బాగా పాపులర్ కాకముందే అవి మొదలు పెట్టి ఇప్పుడు యూత్ దృష్టిలో ఇంకా పెద్ద హీరో అయిపోయాడు.
రాంగోపాల్వర్మ మాదిరిగా టీవీ ఛానల్స్లోకి వచ్చి గంటల కొద్దీ మాట్లాడ్డం లేదు. లేదా ట్విట్టర్లో పడి చేంతాడంత ట్వీట్ త్రెడ్లు కూడా వేయడం లేదు. తనకు తెలిసింది సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాడు. నిన్న కాక మొన్నటి వరకు ఫ్లాప్ డైరెక్టర్ అన్న వాళ్ల చేతే జీనియస్ అనిపించుకుంటున్నాడు. పూరీ సృష్టించిన పండుగాడిని అడిగితే… ‘జ్ఞానం వుంటే సరిపోదు… దాన్నెలా వాడుకోవాలో తెలియాలి అన్నయ్యా’ అంటాడు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…