రాంగోపాల్వర్మకి అపార జ్ఞానం వుంది. అనేక సినిమాలు చూసాడు… అంతకు పదింతల పుస్తకాలు చదివాడు. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలడు. ప్రతి అంశంపై తనదైన శైలిలో వివరణలు ఇవ్వగలడు. అయితే వర్మకు కాంట్రవర్సీ పిచ్చి. పబ్లిసిటీ యావ. అదే అతడిని రాంగ్ ట్రాక్ ఎక్కించి పబ్లిక్ దృష్టిలో పలుచన చేసింది. దానికి తోడు తాను తీసే సినిమాలు కూడా పోను పోనూ క్వాలిటీ కోల్పోయి అతడిని కింది గ్రేడ్ ఫిలింమేకర్స్ లిస్టులోకి తోసింది.
అదే తన శిష్యుడు పూరి జగన్నాథ్ జ్ఞాన సంపదను ఎలా వాడుకోవాలో చూపిస్తున్నాడు. ఫిలింమేకర్గా వర్మ రేంజ్ క్లాసిక్స్ పూరీ తీయలేదు. కమర్షియల్ డైరెక్టర్గా మాస్ జనాల మనసు దోచుకున్నాడు. అలాగే నాలెడ్జ్ పరంగాను వర్మతో పూరి సాటిరాలేడు. కానీ తనకున్న జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలనేది పూరికి బాగా తెలుసు. అందుకే పాడ్ కాస్ట్లు ఇంకా ఇండియాలో బాగా పాపులర్ కాకముందే అవి మొదలు పెట్టి ఇప్పుడు యూత్ దృష్టిలో ఇంకా పెద్ద హీరో అయిపోయాడు.
రాంగోపాల్వర్మ మాదిరిగా టీవీ ఛానల్స్లోకి వచ్చి గంటల కొద్దీ మాట్లాడ్డం లేదు. లేదా ట్విట్టర్లో పడి చేంతాడంత ట్వీట్ త్రెడ్లు కూడా వేయడం లేదు. తనకు తెలిసింది సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాడు. నిన్న కాక మొన్నటి వరకు ఫ్లాప్ డైరెక్టర్ అన్న వాళ్ల చేతే జీనియస్ అనిపించుకుంటున్నాడు. పూరీ సృష్టించిన పండుగాడిని అడిగితే… ‘జ్ఞానం వుంటే సరిపోదు… దాన్నెలా వాడుకోవాలో తెలియాలి అన్నయ్యా’ అంటాడు.
This post was last modified on October 14, 2020 11:27 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…