రాంగోపాల్వర్మకి అపార జ్ఞానం వుంది. అనేక సినిమాలు చూసాడు… అంతకు పదింతల పుస్తకాలు చదివాడు. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలడు. ప్రతి అంశంపై తనదైన శైలిలో వివరణలు ఇవ్వగలడు. అయితే వర్మకు కాంట్రవర్సీ పిచ్చి. పబ్లిసిటీ యావ. అదే అతడిని రాంగ్ ట్రాక్ ఎక్కించి పబ్లిక్ దృష్టిలో పలుచన చేసింది. దానికి తోడు తాను తీసే సినిమాలు కూడా పోను పోనూ క్వాలిటీ కోల్పోయి అతడిని కింది గ్రేడ్ ఫిలింమేకర్స్ లిస్టులోకి తోసింది.
అదే తన శిష్యుడు పూరి జగన్నాథ్ జ్ఞాన సంపదను ఎలా వాడుకోవాలో చూపిస్తున్నాడు. ఫిలింమేకర్గా వర్మ రేంజ్ క్లాసిక్స్ పూరీ తీయలేదు. కమర్షియల్ డైరెక్టర్గా మాస్ జనాల మనసు దోచుకున్నాడు. అలాగే నాలెడ్జ్ పరంగాను వర్మతో పూరి సాటిరాలేడు. కానీ తనకున్న జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలనేది పూరికి బాగా తెలుసు. అందుకే పాడ్ కాస్ట్లు ఇంకా ఇండియాలో బాగా పాపులర్ కాకముందే అవి మొదలు పెట్టి ఇప్పుడు యూత్ దృష్టిలో ఇంకా పెద్ద హీరో అయిపోయాడు.
రాంగోపాల్వర్మ మాదిరిగా టీవీ ఛానల్స్లోకి వచ్చి గంటల కొద్దీ మాట్లాడ్డం లేదు. లేదా ట్విట్టర్లో పడి చేంతాడంత ట్వీట్ త్రెడ్లు కూడా వేయడం లేదు. తనకు తెలిసింది సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాడు. నిన్న కాక మొన్నటి వరకు ఫ్లాప్ డైరెక్టర్ అన్న వాళ్ల చేతే జీనియస్ అనిపించుకుంటున్నాడు. పూరీ సృష్టించిన పండుగాడిని అడిగితే… ‘జ్ఞానం వుంటే సరిపోదు… దాన్నెలా వాడుకోవాలో తెలియాలి అన్నయ్యా’ అంటాడు.
This post was last modified on October 14, 2020 11:27 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…