రాంగోపాల్వర్మకి అపార జ్ఞానం వుంది. అనేక సినిమాలు చూసాడు… అంతకు పదింతల పుస్తకాలు చదివాడు. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలడు. ప్రతి అంశంపై తనదైన శైలిలో వివరణలు ఇవ్వగలడు. అయితే వర్మకు కాంట్రవర్సీ పిచ్చి. పబ్లిసిటీ యావ. అదే అతడిని రాంగ్ ట్రాక్ ఎక్కించి పబ్లిక్ దృష్టిలో పలుచన చేసింది. దానికి తోడు తాను తీసే సినిమాలు కూడా పోను పోనూ క్వాలిటీ కోల్పోయి అతడిని కింది గ్రేడ్ ఫిలింమేకర్స్ లిస్టులోకి తోసింది.
అదే తన శిష్యుడు పూరి జగన్నాథ్ జ్ఞాన సంపదను ఎలా వాడుకోవాలో చూపిస్తున్నాడు. ఫిలింమేకర్గా వర్మ రేంజ్ క్లాసిక్స్ పూరీ తీయలేదు. కమర్షియల్ డైరెక్టర్గా మాస్ జనాల మనసు దోచుకున్నాడు. అలాగే నాలెడ్జ్ పరంగాను వర్మతో పూరి సాటిరాలేడు. కానీ తనకున్న జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలనేది పూరికి బాగా తెలుసు. అందుకే పాడ్ కాస్ట్లు ఇంకా ఇండియాలో బాగా పాపులర్ కాకముందే అవి మొదలు పెట్టి ఇప్పుడు యూత్ దృష్టిలో ఇంకా పెద్ద హీరో అయిపోయాడు.
రాంగోపాల్వర్మ మాదిరిగా టీవీ ఛానల్స్లోకి వచ్చి గంటల కొద్దీ మాట్లాడ్డం లేదు. లేదా ట్విట్టర్లో పడి చేంతాడంత ట్వీట్ త్రెడ్లు కూడా వేయడం లేదు. తనకు తెలిసింది సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాడు. నిన్న కాక మొన్నటి వరకు ఫ్లాప్ డైరెక్టర్ అన్న వాళ్ల చేతే జీనియస్ అనిపించుకుంటున్నాడు. పూరీ సృష్టించిన పండుగాడిని అడిగితే… ‘జ్ఞానం వుంటే సరిపోదు… దాన్నెలా వాడుకోవాలో తెలియాలి అన్నయ్యా’ అంటాడు.
This post was last modified on October 14, 2020 11:27 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…