Movie News

ఇరువురు భామలతో ‘సంక్రాంతి’ వినోదం

పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు, ప్రమోషన్లు చూశాక ఒక్కసారిగా ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా భీమ్స్ ఇచ్చిన మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయిపోయి అన్ని కలిపి 100 మిలియన్ల వ్యూస్ సాధించడం చూసి వెంకీ ఫ్యాన్స్ గర్వంగా ఫీలయ్యారు.

పబ్లిసిటీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో వంద శాతం సక్సెసయ్యాడు. దాంతో అందరి కళ్ళు ట్రైలర్ మీద పడ్డాయి. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎక్స్ లో మహేష్ బాబు ద్వారా ఈ లాంఛనం పూర్తి చేశారు.

ఆశించినట్టే మరోసారి అనిల్ రావిపూడి ఏదో సర్ప్రైజ్ ప్యాకేజ్ ప్లాన్ చేశారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఒక వ్యక్తి కిడ్నాప్ జరుగుతుంది. అతన్ని పట్టుకోవడానికి ఎక్కడో పెళ్లి చేసుకుని దూరంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ (వెంకటేష్) ని తీసుకొచ్చేందుకు మరో లేడీ పోలీస్ (మీనాక్షి చౌదరి) వెళ్తుంది.

అయితే వీళ్లిద్దరి లవ్ స్టోరీ తెలిసిన భార్య (ఐశ్యర్య రాజేష్) ఈ ఆపరేషన్ లో తాను కూడా ఉంటానని పట్టు బడుతుంది. అక్కడి నుంచి అసలు కథ షురూ. పెళ్ళానికి చెప్పలేక, మాజీ ప్రియురాలిని మెప్పించలేక ఖాకీ చొక్కాలో నలిగిపోయే హీరో గారి తిప్పలు అన్ని ఇన్ని కావు. అవేంటో తెరమీద చూడాలి.

చిన్న యాక్షన్ టచ్ ఉన్న పాయింట్ తీసుకుని ఆద్యంతం వినోదాత్మకంగా చూపించాడు అనిల్ రావిపూడి. డైలాగుల్లో తనదైన మార్కు వినిపించింది. బ్రహ్మచారులకు ఇచ్చే సలహాలు, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ సాధించాడని వెంకటేష్ గురించి చెప్పించడాలు బాగా పేలాయి.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరికీ నటనకు ఛాన్స్ దొరికింది. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ సింపుల్ అండ్ స్మూత్ గా సాగగా మాస్ కి కావాల్సిన ఫైట్ల సరంజామా కూడా జోడించారు. వెంకటేష్ సినిమా నుంచి కోరుకునే అంశాలన్నీ పొందుపరిచినట్టు చూపించేశారు. మూవీ మొత్తం ఇలాగే ఉంటే బ్లాక్ బస్టర్ పక్కా.

This post was last modified on January 6, 2025 9:21 pm

Share
Show comments

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago