సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నిర్మాతలు పూర్తయిన తమ సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించలేదు. దసరా పండుగ వస్తున్నా కానీ సినిమాలు థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. విశేషం ఏమిటంటే ఇంకా నిర్మాణ దశలో వున్న సినిమాలకు కూడా ఓటిటి రిలీజ్నే ప్రిఫర్ చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే బయ్యర్లు రావాలి, నిర్మాత అడిగినంత ఇవ్వాలి, ఆపై సినిమాకు కలక్షన్లు రావాలి. ఇంత ప్రాసెస్ ఇప్పటి పరిస్థితుల్లో జరుగుతుందా లేదా అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇంకా ఓటిటి కంపెనీలతోనే బేరసారాలు జరుగుతున్నాయి. లో బడ్జెట్ సినిమాలయితే ఓటిటి కంపెనీల నుంచి మంచి ఆఫర్ వస్తే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ కొట్టేయడానికి సిద్ధంగా వున్నాయి.
సినిమా థియేటర్లు రన్ అవుతున్నాయా లేదా అనేది నిర్మాతల పరేషాన్ కానే కాదు. కరోనాకి ముందున్న మార్కెట్కి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు బయ్యర్ల నుంచి ఆ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అందుకే మార్కెట్ మామూలు స్థితికి వచ్చేవరకు ఓటిటి రిలీజ్ ఉత్తమమని భావిస్తున్నారు. అదీ సంగతి.
This post was last modified on October 15, 2020 10:15 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…