సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నిర్మాతలు పూర్తయిన తమ సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించలేదు. దసరా పండుగ వస్తున్నా కానీ సినిమాలు థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. విశేషం ఏమిటంటే ఇంకా నిర్మాణ దశలో వున్న సినిమాలకు కూడా ఓటిటి రిలీజ్నే ప్రిఫర్ చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే బయ్యర్లు రావాలి, నిర్మాత అడిగినంత ఇవ్వాలి, ఆపై సినిమాకు కలక్షన్లు రావాలి. ఇంత ప్రాసెస్ ఇప్పటి పరిస్థితుల్లో జరుగుతుందా లేదా అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇంకా ఓటిటి కంపెనీలతోనే బేరసారాలు జరుగుతున్నాయి. లో బడ్జెట్ సినిమాలయితే ఓటిటి కంపెనీల నుంచి మంచి ఆఫర్ వస్తే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ కొట్టేయడానికి సిద్ధంగా వున్నాయి.
సినిమా థియేటర్లు రన్ అవుతున్నాయా లేదా అనేది నిర్మాతల పరేషాన్ కానే కాదు. కరోనాకి ముందున్న మార్కెట్కి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు బయ్యర్ల నుంచి ఆ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అందుకే మార్కెట్ మామూలు స్థితికి వచ్చేవరకు ఓటిటి రిలీజ్ ఉత్తమమని భావిస్తున్నారు. అదీ సంగతి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…