సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నిర్మాతలు పూర్తయిన తమ సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించలేదు. దసరా పండుగ వస్తున్నా కానీ సినిమాలు థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. విశేషం ఏమిటంటే ఇంకా నిర్మాణ దశలో వున్న సినిమాలకు కూడా ఓటిటి రిలీజ్నే ప్రిఫర్ చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే బయ్యర్లు రావాలి, నిర్మాత అడిగినంత ఇవ్వాలి, ఆపై సినిమాకు కలక్షన్లు రావాలి. ఇంత ప్రాసెస్ ఇప్పటి పరిస్థితుల్లో జరుగుతుందా లేదా అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇంకా ఓటిటి కంపెనీలతోనే బేరసారాలు జరుగుతున్నాయి. లో బడ్జెట్ సినిమాలయితే ఓటిటి కంపెనీల నుంచి మంచి ఆఫర్ వస్తే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ కొట్టేయడానికి సిద్ధంగా వున్నాయి.
సినిమా థియేటర్లు రన్ అవుతున్నాయా లేదా అనేది నిర్మాతల పరేషాన్ కానే కాదు. కరోనాకి ముందున్న మార్కెట్కి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు బయ్యర్ల నుంచి ఆ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అందుకే మార్కెట్ మామూలు స్థితికి వచ్చేవరకు ఓటిటి రిలీజ్ ఉత్తమమని భావిస్తున్నారు. అదీ సంగతి.
This post was last modified on October 15, 2020 10:15 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…