సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నిర్మాతలు పూర్తయిన తమ సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించలేదు. దసరా పండుగ వస్తున్నా కానీ సినిమాలు థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. విశేషం ఏమిటంటే ఇంకా నిర్మాణ దశలో వున్న సినిమాలకు కూడా ఓటిటి రిలీజ్నే ప్రిఫర్ చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే బయ్యర్లు రావాలి, నిర్మాత అడిగినంత ఇవ్వాలి, ఆపై సినిమాకు కలక్షన్లు రావాలి. ఇంత ప్రాసెస్ ఇప్పటి పరిస్థితుల్లో జరుగుతుందా లేదా అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇంకా ఓటిటి కంపెనీలతోనే బేరసారాలు జరుగుతున్నాయి. లో బడ్జెట్ సినిమాలయితే ఓటిటి కంపెనీల నుంచి మంచి ఆఫర్ వస్తే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ కొట్టేయడానికి సిద్ధంగా వున్నాయి.
సినిమా థియేటర్లు రన్ అవుతున్నాయా లేదా అనేది నిర్మాతల పరేషాన్ కానే కాదు. కరోనాకి ముందున్న మార్కెట్కి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు బయ్యర్ల నుంచి ఆ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అందుకే మార్కెట్ మామూలు స్థితికి వచ్చేవరకు ఓటిటి రిలీజ్ ఉత్తమమని భావిస్తున్నారు. అదీ సంగతి.
This post was last modified on October 15, 2020 10:15 am
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…