ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్దే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా అభిమానులు ఎలా ఊగిపోతారో తెలిసిందే. ఆయనేమో ఫిలిం కెరీర్ మీద ఫోకస్ తగ్గించేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసేలా ఉన్నారు. ఆ లోపు పవన్ తనయుడు అకీరా తెరంగేట్రం చేస్తే బాగుంటుందన్నది అభిమానులు ఆకాంక్ష. ఐతే అకీరా అయితే ప్రస్తుతానికి సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్లు కనిపించడం లేదు. ఓవైపు చదువు సాగిస్తూనే.. ఇంకోవైపు సంగీతం మీద ఫోకస్ చేస్తున్నాడు.
నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు కానీ.. దాని గురించి సమాచారం ఏదీ బయటికి రాలేదు.ఈ నేపథ్యంలో కొడుకు అరంగేట్రం గురించి రేణు దేశాయ్ మాట్లాడ్డం మీడియా దృష్టిని ఆకర్షించింది. అకీరా సినిమాల్లోకి రావాలని తాను కూడా కోరుకుంటున్నానని రేణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐశ్వర్యా ఫుడ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా వాళ్లు కొడుకు తెరంగేట్రం గురించి అడిగితే.. ‘‘అకీరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారోనని అభిమానులందరూ ఎదురుస్తున్నారు. తన తల్లిగా ఆ ఆతృత నాకూ ఉంది. అకీరా నందన్ తన ఇష్టపూర్వకంగానే సినీ రంగ ప్రవేశం చేస్తాడు’’ అని రేణు వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర వైపు రావాలన్న అక్కడి నాయకుల వ్యాఖ్యలపై రేణు స్పందిస్తూ.. ఇక్కడ ఇండస్ట్రీ ఎదిగితే తనకూ సంతోషమే అని చెప్పారు. గోదావరి ప్రాంతంలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని.. ఇక్కడి అందాలను చూడడానికి తనకు రెండు కళ్లూ సరిపోలేదని రేణు అన్నారు.
This post was last modified on January 5, 2025 8:12 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…