ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్దే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా అభిమానులు ఎలా ఊగిపోతారో తెలిసిందే. ఆయనేమో ఫిలిం కెరీర్ మీద ఫోకస్ తగ్గించేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసేలా ఉన్నారు. ఆ లోపు పవన్ తనయుడు అకీరా తెరంగేట్రం చేస్తే బాగుంటుందన్నది అభిమానులు ఆకాంక్ష. ఐతే అకీరా అయితే ప్రస్తుతానికి సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్లు కనిపించడం లేదు. ఓవైపు చదువు సాగిస్తూనే.. ఇంకోవైపు సంగీతం మీద ఫోకస్ చేస్తున్నాడు.
నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు కానీ.. దాని గురించి సమాచారం ఏదీ బయటికి రాలేదు.ఈ నేపథ్యంలో కొడుకు అరంగేట్రం గురించి రేణు దేశాయ్ మాట్లాడ్డం మీడియా దృష్టిని ఆకర్షించింది. అకీరా సినిమాల్లోకి రావాలని తాను కూడా కోరుకుంటున్నానని రేణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐశ్వర్యా ఫుడ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా వాళ్లు కొడుకు తెరంగేట్రం గురించి అడిగితే.. ‘‘అకీరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారోనని అభిమానులందరూ ఎదురుస్తున్నారు. తన తల్లిగా ఆ ఆతృత నాకూ ఉంది. అకీరా నందన్ తన ఇష్టపూర్వకంగానే సినీ రంగ ప్రవేశం చేస్తాడు’’ అని రేణు వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర వైపు రావాలన్న అక్కడి నాయకుల వ్యాఖ్యలపై రేణు స్పందిస్తూ.. ఇక్కడ ఇండస్ట్రీ ఎదిగితే తనకూ సంతోషమే అని చెప్పారు. గోదావరి ప్రాంతంలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని.. ఇక్కడి అందాలను చూడడానికి తనకు రెండు కళ్లూ సరిపోలేదని రేణు అన్నారు.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…