Movie News

చిరంజీవే మాకు ఆద్యులు – పవన్ కళ్యాణ్

అన్నయ్య చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రేమో ఇప్పటికే లెక్కలేనన్ని సందర్భాల్లో బయటపడినా ప్రతిసారి కొత్తగా అనిపించడం ఆ అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక. ఎన్నికల్లో విజయం సాధించాక స్వయంగా చిరు ఇంటికి పవన్ వెళ్లి కాలికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ప్రతి ఒక్కరిని తాకింది. ఇవాళ మరో అరుదైన జ్ఞాపకం భద్రపరుచుకునే అవకాశం మెగా ఫ్యాన్స్ కు దక్కింది. రాజమండ్రిలో లక్షకు పైగా హాజరైన జనసందోహం మధ్య జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని మరోసారి చాటారు.

మీరు పవన్ కళ్యాణ్ అన్నా, రామ్ చరణ్ అన్నా, ఓజి అన్నా, గేమ్ ఛేంజర్ అన్నా అన్నింటికి ఆద్యులు చిరంజీవేనని, ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చి స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చిన తీరే మమ్మల్ని ఇలా నిలిపిందని, మూలాలు మర్చిపోయే వ్యక్తిని కాదంటూ పవర్ స్టార్ అనడంతో ఒక్కసారిగా ప్రాంగణం చప్పట్లు, ఈలలతో మారుమ్రోగి పోయింది. దీనికన్నా ముందు టాలీవుడ్ ఉన్నత స్థాయికి దోహదం చేసిన మహానీయులను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్ స్వర్గీయులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ప్రస్తావన తీసుకువచ్చి గౌరవాన్ని చాటుకున్నారు. ఈ దిగ్గజాలు సినీ పరిశ్రమకు చేసిన సేవలను స్మరించుకున్నారు.

దర్శకుడు శంకర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు పవన్. జెంటిల్మెన్ సినిమాని చెన్నైలో బ్లాక్ టికెట్ కొనుక్కుని చూసిన సంఘటనని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రసంగం మొదట్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు అంటూ స్వంత ఫ్యాన్స్ ని సైతం సంబోధించడం ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి రాజకీయంగా చిరంజీవి ప్రజా వ్యవహారాలకు దూరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి తన కృతజ్ఞతను తెలియజేసుకుంటూనే ఉండటం గేమ్ ఛేంజర్ వేడుకలో మరోసారి బయట పడింది. జనవరి 10 విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం సాయంత్రమే టికెట్ రేట్ల వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే.

This post was last modified on January 4, 2025 9:18 pm

Share
Show comments

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

32 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

1 hour ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago