గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా మార్చడం 2022లో మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడే మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్ల్లో కొత్త రికార్డులు నెలకొల్పడం.. రిలీజ్ టైంలో అభిమానుల సెలబ్రేషన్ పీక్స్కు చేరడం చూసి.. మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా దీన్ని అనుసరించడం మొదలుపెట్టారు.
గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్లో సంచలన వసూళ్లు సాధించి ఔరా అనిపించాయి. టాలీవుడ్ను చూసి వేరే ఇండస్ట్రీల్లో సైతం ఈ రీ రిలీజ్ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాయి. కోలీవుడ్లో సైతం స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఒరవడి బాలీవుడ్కు కూడా పాకుతోంది.
కొన్ని నెలల కిందట ‘తుంబాడ్’ అనే హార్రర్ థ్రిల్లర్ను రీ రిలీజ్ చేస్తే దానికి సంచలన వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ రిలీజ్ టైంలో కంటే ఇప్పుడే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో పాత సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, బిపాసా బసు ముఖ్య పాత్రలు పోషించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.
‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రానికి రీ రిలీజ్లో బుక్ మై షోలో దాదాపు లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. శుక్రవారం కోటిన్నర దాకా వసూళ్లు వచ్చాయి. వీకెండ్లో కొత్త సినిమా లాగా ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హిందీ హీరోలకు మన దగ్గర ఉన్నట్లు ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్, సంఘాలు ఉండవు. మన అభిమానుల్లో ఉండే మ్యాడ్నెస్ కూడా కనిపించదు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి రణబీర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనికి పబ్లిసిటీ కూడా లేదు. అయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది.
This post was last modified on January 4, 2025 6:45 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…