గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా మార్చడం 2022లో మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడే మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్ల్లో కొత్త రికార్డులు నెలకొల్పడం.. రిలీజ్ టైంలో అభిమానుల సెలబ్రేషన్ పీక్స్కు చేరడం చూసి.. మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా దీన్ని అనుసరించడం మొదలుపెట్టారు.
గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్లో సంచలన వసూళ్లు సాధించి ఔరా అనిపించాయి. టాలీవుడ్ను చూసి వేరే ఇండస్ట్రీల్లో సైతం ఈ రీ రిలీజ్ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాయి. కోలీవుడ్లో సైతం స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఒరవడి బాలీవుడ్కు కూడా పాకుతోంది.
కొన్ని నెలల కిందట ‘తుంబాడ్’ అనే హార్రర్ థ్రిల్లర్ను రీ రిలీజ్ చేస్తే దానికి సంచలన వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ రిలీజ్ టైంలో కంటే ఇప్పుడే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో పాత సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, బిపాసా బసు ముఖ్య పాత్రలు పోషించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.
‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రానికి రీ రిలీజ్లో బుక్ మై షోలో దాదాపు లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. శుక్రవారం కోటిన్నర దాకా వసూళ్లు వచ్చాయి. వీకెండ్లో కొత్త సినిమా లాగా ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హిందీ హీరోలకు మన దగ్గర ఉన్నట్లు ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్, సంఘాలు ఉండవు. మన అభిమానుల్లో ఉండే మ్యాడ్నెస్ కూడా కనిపించదు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి రణబీర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనికి పబ్లిసిటీ కూడా లేదు. అయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…