గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా మార్చడం 2022లో మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడే మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్ల్లో కొత్త రికార్డులు నెలకొల్పడం.. రిలీజ్ టైంలో అభిమానుల సెలబ్రేషన్ పీక్స్కు చేరడం చూసి.. మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా దీన్ని అనుసరించడం మొదలుపెట్టారు.
గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్లో సంచలన వసూళ్లు సాధించి ఔరా అనిపించాయి. టాలీవుడ్ను చూసి వేరే ఇండస్ట్రీల్లో సైతం ఈ రీ రిలీజ్ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాయి. కోలీవుడ్లో సైతం స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఒరవడి బాలీవుడ్కు కూడా పాకుతోంది.
కొన్ని నెలల కిందట ‘తుంబాడ్’ అనే హార్రర్ థ్రిల్లర్ను రీ రిలీజ్ చేస్తే దానికి సంచలన వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ రిలీజ్ టైంలో కంటే ఇప్పుడే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో పాత సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, బిపాసా బసు ముఖ్య పాత్రలు పోషించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.
‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రానికి రీ రిలీజ్లో బుక్ మై షోలో దాదాపు లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. శుక్రవారం కోటిన్నర దాకా వసూళ్లు వచ్చాయి. వీకెండ్లో కొత్త సినిమా లాగా ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హిందీ హీరోలకు మన దగ్గర ఉన్నట్లు ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్, సంఘాలు ఉండవు. మన అభిమానుల్లో ఉండే మ్యాడ్నెస్ కూడా కనిపించదు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి రణబీర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనికి పబ్లిసిటీ కూడా లేదు. అయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…