పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ రన్ ముగింపుకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్ 5 విడుదలైన తేదీ నుంచి ఇప్పటిదాకా ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో ఇండస్ట్రీ టాపిక్ గా నిలుస్తున్న ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ తాజాగా బుక్ మై షోలో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ ఒక్క యాప్ / వెబ్ సైట్ ద్వారా పుష్ప 2 ఏకంగా 20 మిలియన్లు అంటే 2 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటిదాకా ఈ ఘనత బాహుబలి 2 (15 మిలియన్లకు పైగా) పేరు మీద ఉండగా దాన్ని అల్లు అర్జున్ – సుకుమార్ తీసేసుకున్నారు. ఇంకో వారం పది రోజులు వీకెండ్స్ జోరు కొనసాగనుంది.
ఇక్కడ ఇంకో ప్రత్యేకత గురించి మాట్లాడుకోవాలి. పుష్ప 2 విడుదల సమయంలో జొమాటో స్థాపించిన డిస్ట్రిక్ట్ అనే కొత్త టికెటింగ్ పార్ట్ నర్ ని అధికారికంగా తీసుకొచ్చారు. చాలా నగరాలు, పట్టణాల థియేటర్ల ఆన్ లైన్ బుకింగ్స్ కేవలం పేటీఎం ద్వారానే జరిగేవి. అవన్నీ డిస్ట్రిక్ట్ కి మారిపోవడంతో ఒక్కసారిగా లక్షలాది ప్రేక్షకులు ఆ యాప్ ని ఇన్స్ టాల్ చేసుకుని టికెట్లు కొన్నారు.
అంటే ఇంత పోటీలోనూ బుక్ మై షోలో పుష్ప 2 రెండు కోట్ల టికెట్లు అమ్మడం ఆషామాషీ కాదు. సగటున ఒక టికెట్ కమీషన్ 30 రూపాయలు వేసుకున్నా వాటి ద్వారా వచ్చిన ఆదాయమే 60 కోట్లంటే ఇంతకన్నా చెప్పేందుకు ఏముంది.
కేవలం పుష్ప 2 ద్వారా బుక్ మై షో ఇంత ఆదాయం ఆర్జించిందన్న మాట. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడమంటే అంత సులభం కాదు. కల్కి 2898 ఏడి సైతం భారీ నెంబర్లు నమోదు చేసింది కానీ బాహుబలి 2ని దాటలేదు. కానీ పుష్పరాజ్ సాధించాడు.
ఇందులో సింహ భాగం నార్త్ ఆడియన్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఊహించిన దానికన్నా చాలా భారీగా ఉత్తరాది రాష్ట్రాల ప్రేక్షకులు ఎగబడి చూశారు. ముంబై నుంచి బీహార్ లోని చిన్న ఊళ్ళ దాకా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. మళ్ళీ ఈ రికార్డుని తిరగరాయాలంటే ఇంకో టాలీవుడ్ మూవీ వల్లే సాధ్యమవుతుందేమో. తెలుగోడి సత్తా అంటే అదే.
This post was last modified on January 4, 2025 2:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…